'రాణి' లేకుండానే బరిలోకి.. ఎలా రాణిస్తుందో?
ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత మహిళల హాకీ జట్టులో సీనియర్ గోల్ కీపర్ గా ఉన్నా సవితా సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు ప్రపంచ కప్లో బరిలోకి దిగబోతోంది అన్నది తెలుస్తుంది. అయితే తొడ కండరాల గాయం కారణంగా జట్టుకు దూరమైన రాణి రాంపల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు అనేది తెలుస్తుంది. దీంతో ఆమెను ఎంపిక చేయలేదని హాకీ ఇండియా ఇటీవలే తెలిపింది. అయితే గత ఏడాది టోక్యో ఒలంపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు తొలిసారి 4వ స్థానంలో నిలిచింది. భారత మహిళల జట్టు ఈ ఘనత సాధించడం వెనక రాణి రాంపల్ కీలకపాత్ర వహించింది.
అయితే గాయం కారణంగా ఒలంపిక్స్ తర్వాత ఏ టోర్నీ ఆడలేదు రాణి రాంపల్. ఇటీవలే ప్రూ లీగ్ లో మొదటి నాలుగు మ్యాచ్ లకు ఎంపిక చేసిన పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో మ్యాచ్ లకు దూరం అయింది రాణి రాంపల్. దీంతో ఆమెను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించారు అన్నది తెలుస్తుంది. నెదర్లాండ్స్, స్పెయిన్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల ప్రపంచ హాకీ టోర్నమెంట్ వచ్చే నెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగబోతుంది.
కాగా హాకీ ఇండియా ప్రకటించిన భారత మహిళల హాకీ జట్టు వివరాలు ఇలా ఉన్నాయి : సవిత (కెప్టెన్, గోల్కీపర్), దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెప్టెన్), బిచూ దేవి, గుర్జీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను, మోనిక, నేహా, జ్యోతి, నవ్జ్యోత్ కౌర్, సోనిక, సలిమా టేటే, వందన కటారియా, లాల్రెమ్సియామి, నవ్నీత్ కౌర్, షర్మిలా దేవి.