సూపర్ సెంచరీ.. సూర్యకుమార్ ప్రపంచ రికార్డు?

praveen
ఇటీవల ఇంగ్లాండ్ లో జరుగుతున్న టీ 20 సిరీస్ లో భాగంగా అటు టీమిండియా మూడో మ్యాచ్లో ఓడిపోయిన విషయం తెల్సిందే. దీంతో ఇక సొంతగడ్డపైనే ఇంగ్లాండ్ ను క్లీన్ స్వీప్ చేయాలి అన్న పథకం ఫలించలేదు. ఈ క్రమంలోనే అటు మూడో మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ అప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. అయితే అటు ఇండియా ఓడిపోయినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల కళ్లముందు మెదులుతోంది అని చెప్పాలి. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ల పై వీర విహారం చేస్తూ 360 డిగ్రీస్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడిన షాట్లు ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు అని చెప్పాలి.


 సిక్సర్లు ఫోర్లతో  చెలరేగిపోయినా సూర్యకుమార్ యాదవ్  ఏకంగా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 55 బంతుల్లో 11 ఫోర్లు ఆరు సిక్సర్లు సహాయంతో 117 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ ఎంతో వీరోచితంగా పోరాటం చేసినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్ల నుంచి సహకారం లేకపోవడంతో చివరి ఓటమిపాలైంది. ఇండియా ఓడినప్పటికీ అటు సూర్యకుమార్ యాదవ్ మాత్రం సెంచరీతో టీమ్ ఇండియా అభిమానులే కాదు ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు అభిమానుల మనసులు కూడా గెలిచాడు. పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అన్నది తెలుస్తోంది.


 పొట్టి ఫార్మాట్ లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన మొదటి  బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గతంలో ఈ రికార్డ్ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మాక్స్వెల్ పేరిట ఉండేది. టీమిండియా తో బెంగుళూరు లో 2019 లో జరిగిన మ్యాచ్లో అదరగొట్టాడు. ఇక ఆ మ్యాచ్లో మ్యాక్స్వెల్ 113 పరుగులు చేసాడు. దీంతో ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లోనూ మూడో స్థానంలో వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు అతని పేరునే ఉండేది. కానీ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ 117 పరుగులతో ఆ రికార్డును బ్రేక్ చేసేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: