కోహ్లీ కంటే రోహిత్ టాలెంటెడ్ : పాక్ క్రికెటర్

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో సీనియర్ ప్లేయర్ లుగా కొనసాగుతున్నారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. భారత జట్టు ఏ ఫార్మాట్ లో మ్యాచ్ ఆడిన సరే ఇద్దరు ఆటగాళ్లు జట్టులో తప్పకుండ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి ఎంతో సమర్ధవంతంగా ముందుకు నడిపించాడు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ తర్వాత మొన్నటివరకు వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ 3ఫార్మాట్ ల కెప్టెన్సీ అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇద్దరు ఆటగాళ్ళు కూడా ఎంతో అద్భుతమైన బ్యాట్స్మెన్లు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టారు.

ఈ క్రమంలోనే అభిమానులు ఒకరిని హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు.. ఇక మరొకరిని పరుగుల యంత్రం అని పిలుచుకుంటారు అభిమానులు. ఎలా పిలిచినా ఇద్దరు మాత్రం టీమిండియాను గెలిపించడానికి ఎప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇద్దరు క్రికెటర్లలో ఎవరు గొప్ప అంటే మాత్రం అభిమానులకు చెప్పటం చాలా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు ఎప్పుడూ మెరుగైన ప్రదర్శన చేస్తూ ఉంటారు. అంతేకాదు పరుగుల వరద పారిస్తూ ఉంటారు. సిక్సర్లు ఫోర్ల తో చెలరేగిపోతున్నారు. అందుకే ఇద్దరిలో ఎవరు టాలెంటెడ్ ప్లేయర్ అంటే చెప్పడం చాలా కష్టం.

 కానీ విరాట్ కోహ్లీ కంటే ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా టాలెంటెడ్ ప్లేయర్ అంటూ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఇమామ్ ఉల్ హక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ఇమామ్ ఉల్ హక్ నా దృష్టిలో విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ టాలెంటెడ్ ప్లేయర్. నేను ఇద్దరి ఆట చూశాను. కాని రోహిత్ శర్మ బ్యాటింహ్ లో టైమింగ్ బాగుంటుంది. అది అతనికి ఒక వరం లాంటిది.. కేవలం క్షణాల్లో మ్యాచ్ తమ వైపుకు తిప్పగలడు. అందుకే నేను రోహిత్ శర్మ లా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను అంటూ ఇమామ్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: