ఆకాష్ చోప్రా చెప్పిందే నిజమైంది.. ఆ జట్టు ఓడిపోయింది?
బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు గెలిచే ప్రసక్తే లేదు అని చెప్పుకొచ్చాడు ఆకాశ్ చోప్రా. ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో కూడా ఎంతో పటిష్టంగా ఉంది అంటూ తెలిపాడు. బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ పరంగా కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం ఎన్నో సమస్యలు ఉన్నాయి అంటూ తెలిపాడు. అదృష్టం కలిసి వస్తే తప్పక బంగ్లాదేశ్ గెలవడం కష్టమే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. చివరికి నిన్న బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆకాశ్ చోప్రా చెప్పిందే నిజమైంది అని చెప్పాలి.
ఆకాశ్ చోప్రా చెప్పినట్లుగానే బంగ్లాదేశ్ బ్యాటింగ్ విభాగం ఎంతో పేలవమైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే అటు ఆఫ్ఘనిస్తాన్కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇక నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 127 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది బంగ్లాదేశ్ జట్టు. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లను పరుగులు చేయనివ్వకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు బంగ్లాదేశ్ బౌలర్లు. కానీ ఆచితూచి ఆడిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు చివరి బంగ్లాదేశ్ తమ ముందు ఉంచిన టార్గెట్ ఛేధించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.