ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్.. చరిత్ర సృష్టించింది?

praveen
అంతర్జాతీయ వేదిక లో ఎన్ని మ్యాచ్లు జరిగిన అటు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే మాత్రం ఆల్ టైం ఫేవరేట్ మ్యాచ్గా కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ద్వైపాక్షిక సిరీస్లో జరగవు.  ఈ రెండు జట్లు తలపడ్డాయి అంటే ఇది అంతర్జాతీయ వేదికలపై మాత్రమే అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్, ఆసియా కప్ లాంటి వేదికలపైన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ ను హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకుంటూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు.


 ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు ఉత్కంఠ ఆ రేంజిలో ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులు అయితే దాయదుల పోరు  కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు అదో ఎమోషన్ గౌరవం అన్నట్లుగా భావిస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే కన్నార్పకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. అందుకే వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం వ్యూయర్షిప్ పరంగా కూడా రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన క్రేజ్ మాత్రం తగ్గలేదు అన్నదానికి ఇక్కడ ఒక రికార్డు నిదర్శనం అని చెప్పాలి.


 ఆసియా కప్ లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు ఆగస్టు 28 వ తేదీన మొదటి మ్యాచ్ ఆడాయి. మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరి బంతి వరకు జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆగస్టు 28 వ తేదీన జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రికార్డు సృష్టించింది. ప్రపంచ కప్ టోర్నీ కాకుండా అత్యధికంగా ప్రేక్షకుల వీక్షించిన టి 20 మ్యాచ్ గా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చరిత్రకెక్కింది..  బిఏఆర్సి డేటా ప్రకారం.. స్టార్ స్పోర్ట్స్.. డిడి స్పోర్ట్స్ లో 133 మిలియన్ల మంది ఈ మ్యాచ్ వీక్షించారు. దీన్ని బట్టి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంత హైప్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: