గుడ్ న్యూస్ చెప్పిన జడేజా.. రీస్టార్ట్ అంటూ పోస్ట్?
ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో మూడు ఫార్మాట్లలో కూడా రవీంద్ర జడేజా ఎంతో కీలక ఆటగాడిగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అలాంటి రవీంద్ర జడేజా టీమిండియా జట్టును కష్టాల్లోకి నెట్టాడు. మోకాలి గాయం బారిన పడిన రవీంద్ర జడేజా చివరికి జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ జరగడంతో చివరికి ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా ఇక టి20 వరల్డ్ కప్ కి కూడా అతను అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. రవీంద్ర జడేజా గాయం తీవ్రత ఎంత ఎక్కువగా ఉంది అనేది మాత్రం తెలుస్తుంది.
ఇకపోతే ఇటీవల రవీంద్ర జడేజా చేసిన పోస్ట్ కాస్త అభిమానులందరి లో కూడా సరికొత్త ఉత్సాహాన్ని నింపింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. మళ్లీ గ్రౌండ్ లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాను అంటూ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు కాలుకు పట్టితో కర్ర సహాయంతో కనిపించిన జడేజా ఇటీవలే ఒక ఫోటో షేర్ చేస్తూ రీస్టార్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా త్వరగా ఫిట్ అవ్వాలని జట్టులోకి రావాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ పోస్టు చూసి అభిమానులు అందరూ కూడా తెగ ఆనందపడి పోతున్నారు.