టీమిండియా ఓడినా.. కోహ్లీ మాత్రం రికార్డు సృష్టించాడు?
ప్రతి మ్యాచ్ లో కూడా జట్టుకు విజయాన్ని అందించే ఇన్నింగ్స్ ఆడి విరాట్ కోహ్లీ ప్రేక్షకులను ఫిదా చేసేసాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా వరల్డ్ కప్ లో భాగంగా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోహ్లీ మరోవైపు వరుసగా అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన ఇండియా జట్టు ఇంటి బాట పట్టింది.
అయితే టీమిండియా ఓడిపోయినప్పటికీ కూడా అటు విరాట్ కోహ్లీ మాత్రం ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే అంతర్జాతీయ టి20 లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మరో ఘనత సాధించాడు. ఏకంగా అంతర్జాతీయ టి20లలో 4000 పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక ఆటగాడిగా కోహ్లీ ఆసక్తికర రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఘోర పరాభవాన్ని చదివి చూడడాన్ని అభిమానులు మాత్రం అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు అని చెప్పాలి.