అతన్ని సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది : వీరేంద్ర సెహ్వాగ్

praveen
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా పేలవ  ప్రదర్శనతో నిరాశపరిచిన టీమ్ ఇండియా మరికొన్ని రోజులలో వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో  బిజీ కావడానికి సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట న్యూజిలాండ్లో పర్యటించడానికి వెళ్తుంది. ఇక ఇప్పటికే న్యూజిలాండ్ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లకు విశ్రాంతి ప్రకటించగా హార్దిక్ పాండ్యా  ఇక టి20 సిరీస్ కి  వ్యవహరించబోతున్నాడు. ఇక న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆడబోయే వన్డే సిరీస్ కి శిఖర్ ధావన్ కెప్టెన్సి వహించబోతున్నాడు అని చెప్పాలి .


 ఇకపోతే ఇక ఈ న్యూజిలాండ్ సిరీస్ లో భాగంగా మొన్నటి వరకు టీం ఇండియాలో చోటు కోల్పోయిన యువ ఆటగాళ్లకూ ఎంతో మందికి అవకాశం దక్కింది అని చెప్పాలి. న్యూజిలాండ్ పర్యటన అటు యువ ఆటగాళ్లు అందరికీ కూడా ఒక మంచి అవకాశం అని న్యూజిలాండ్ పర్యటనలో బాగా రానిస్తే రానున్న రోజుల్లో టీమ్ ఇండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉందని సలహాలు ఇస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు. అదే సమయంలో న్యూజిలాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో మరికొంతమంది ఆటగాళ్లు ఉంటే బాగుంటుంది అని దానిపై కూడా అటు మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.


 ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న పృద్విషాను సెలెక్టరు పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టాడు. అతను చివరగా టీమిండియా తరఫున గత ఏడాది టీ20లలో ఆడాడు. ఇప్పుడు జట్టుకు పృద్వి షా అవసరం ఎంతో ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు. అతను విధ్వంసకర ఆటగాడు.. పవర్ ప్లే లో పరుగులు రాబట్టే సత్తా అతనికి ఉంది. న్యూజిలాండ్ పర్యటనలో అతని సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: