కోహ్లీ సెంచరీల రికార్డుపై.. పాక్ మాజీ సెటైర్లు?
ఇకపోతే ఇక విరాట్ కోహ్లీ ఇలా గొప్ప రికార్డు సాధించడం పై అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే అటు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మాత్రం ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డులపై సెటైర్లు వేయడం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎప్పుడు భారత ఆటగాళ్ల ప్రదర్శన పై అక్కసును వెళ్ళకకే పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ల జాబితాలో ఇక ఇటీవల రషీద్ లతీఫ్ కూడా చేరిపోయాడు అని చెప్పాలి. కోహ్లీ రికార్డులను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ 100 సెంచరీలు సాధించడం ముఖ్యం కాదు. దేశానికి వరల్డ్ కప్ టైటిల్ అందించడమే ముఖ్యం అంటూ ఎద్దేవా చేశాడు.
భారత క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ సాధించే రికార్డుల కోసం ఎదురుచూడటం లేదని.. కేవలం టీమిండియా టైటిల్ సాధిస్తే బాగుండు అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు అంటూ రషీద్ లతీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక తన వ్యాఖ్యలతో ఇటీవలే ఐసీసీ టోర్నీలలో టీమిండియా దారుణ వైఫల్యాలను ఎత్తి చూపాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ 100 కాదు 200 సెంచరీలు కొట్టినా కూడా టీమిండియా టైటిల్ గెలవకపోతే మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు ఎద్దేవా చేశాడు. ఈ క్రమంలోనే ఎంతోమంది భారత అభిమానులు అతని వ్యాఖ్యలపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.