ఇక బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఫస్ట్ డే ఆట ముగిసింది. ఈ ఆట పూర్తయ్యే నాటికి టీమ్ఇండియాకే ఆధిపత్యం అనేది దక్కింది.టీం ఇండియా సీనియర్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ చాలా బాగా అదరగొట్టేశారు. బాగా దూకుడుగా ఆడి భారత్ మీద ఒత్తిడి పెంచుదామనుకున్న లిట్టన్ దాస్ను అశ్విన్ పెవిలియన్కు పంపడం జరిగింది. లిట్టన్ మొత్తం 26 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ఒక దశలో 213/5తో బాగా ఆడిన బంగ్లా జట్టు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడం జరిగింది. ఫస్ట్ టెస్టులో సెంచరీ చేసిన జకిర్ హసన్ (15 రన్స్ )విఫలమవ్వడం జరిగింది. అతను ఉనద్కత్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరాడు.మామినుల్ హక్(84: 12 ఫోర్లు, ఒక సిక్స్) ఒంటరి పోరాటం చేసినా కానీ అతనికి ఇతర ఆటగాళ్లెవరూ కూడా సహకరించలేదు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో బంగ్లా 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఉమేశ్ ఇంకా అశ్విన్ చెరో నాలుగు వికెట్లని పడగొట్టగా.. జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు పడగొట్టాడు.ఇక ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు బాగా నిలకడగా ఆడటం జరిగింది. టీం ఇండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ (3*) ఇంకా శుభ్మన్ గిల్(14*) క్రీజులో ఉన్నారు. మధ్యలో రెండుసార్లు వీరు ఔటయ్యే ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నారు. అయితే వెలుతురు లేమి సమస్య కారణంగా మ్యాచ్ను కుదించడం జరిగింది.మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా వికెట్ నష్టపోకుండా మొత్తం 19 పరుగులతో ఉంది.ఇక బంగ్లాతో జరిగిన ఫస్ట్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉన్న రెండో టెస్టులో కూడా గెలిచి సిరీస్ను ఇక క్వీన్స్వీప్ చేయాలని చూస్తోంది. అలా జరిగితేనే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో నిలిచేందుకు భారత్కు అవకాశాలు బాగా మెరుగుపడుతాయి.