క్లిష్ట పరిస్థితులలో ఇలాగే ఆడాలి... కోచ్ అవతారమెత్తిన హార్దిక్ పాండ్య!

praveen
నువ్వా నేనా? అని ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించి ఔరా అనిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 162/5 స్కోరు చేసింది. ఆ తరువాత లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంక 160 పరుగులకే ఆలౌట్ అయ్యి శ్రీలంక అభిమానులను నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తరువాత ఇరు జట్ల కెప్టెన్లు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు మాట్లాడారు. ముందుగా భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.... చాలా ఆనందంగా ఉంది నేడు. మ్యాచ్ మధ్యలో కాస్త ఇబ్బందికి గురైనప్పటికీ.. ఇప్పుడు అంతా బాగానే అనిపిస్తోంది... అని అన్నాడు.

ఇంకా మాట్లాడుతూ... "ఈ క్షణంలో కాలు కాస్త ఇబ్బంది పెడుతోంది. తిమ్మిరి పట్టినట్లు అనిపిస్తోంది. సరైన నిద్ర, ఎక్కువగా నీళ్లు తాగకపోవడం ఆట మధ్యలోనే కండరాలు పట్టేసినట్లు అనిపించింది. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా రాణించాలనే దానికి ఇదొక ఉదాహరణ మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. మిగతావాళ్ళు కూడా ఇదే మాదిరిగా అనుకుంటున్నారని భావిస్తున్నాను. ఇపుడు ఆడిన మ్యాచ్ అనుభవం తప్పకుండా పెద్ద టోర్నీల్లో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను." అని చెప్పుకొచ్చాడు.

ఇంకా అతని నాయకత్వం గురించి మాట్లాడుతూ.... "ఈ రోజు మా యువ ఆటగాళ్లకు క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. IPLలో శివమ్ మావి బౌలింగ్ ప్రదర్శనను నేను ప్రత్యక్షంగా చూసాను. అతడి సత్తా ఏమిటో నాకు బాగా తెలుసు. అందుకే బ్యాటర్లు హిట్టింగ్ చేసినా కంగారు పడొద్దని ముందే చెప్పను. ఇక నేను బంతిని స్వింగ్ చేయడంపైనే ఎక్కువగా దృష్టి సారించాను. కొత్త బంతితో నెట్లో కూడా ప్రాక్టీస్ బాగా చేశా." అని చెప్పుకొచ్చాడు. ఇక శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక మాట్లాడుతూ... ఓటమిని అంగీకరిస్తున్నాం. ఇలా ఈరోజు ఓడిపోవడం చాలా బాధాకరంగా వుంది. వాఖండేలో బ్యాటర్లకు కాస్త అనుకూలంగానే ఉందనిపించింది. కానీ ఇండియాని 160 పరుగుల లోపు కట్టడి చేసుంటే బాగుండేది. ఆ విషయంలో మేము కాస్త వెనుకబడ్డాం. తర్వాతి మ్యాచ్ కి బాగా సిద్ధమై వస్తాం.... అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: