ఇండియన్ టెన్నిస్ స్టార్ అయిన సానియా మీర్జా తన ఫ్యాన్స్కు పెద్ద షాకిచ్చింది. ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకుంది. సానియా మీర్జా ఇక టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ను ప్రకటించింది.సానియా మీర్జా ప్రొఫెషనల్ టెన్నిస్కు అధికారికంగా వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని సానియా మీర్జా సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తన కొడుకుతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నట్లు సానియా మీర్జా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు చెందిన ఆరేళ్ల బాలిక తొలిసారిగా టెన్నిస్ కోర్టులో అడుగు పెట్టిందని ఇంకా తన తల్లితో కలిసి వెళ్లిన సానియా.. టెన్నిస్ ఎలా ఆడాలో కోచ్ వివరించారని పోస్ట్ లో తెలిపింది. నేను టెన్నిస్ నేర్చుకోవడానికి చాలా చిన్న అనుకున్నాను అని సానియా మీర్జా పోస్ట్ లో పేర్కొంది. ఈ నా కలల పోరాటం 6 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైందని ఎమోషనల్ పోస్ట్ చేసింది.
సానియా మీర్జా సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, 19 ఫిబ్రవరి 2023 నుంచి దుబాయ్లో స్టార్ట్ అయ్యే మొదటి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆఫ్ ది ఇయర్ తర్వాత సానియా మీర్జా తన కెరీర్కు పూర్తిగా వీడ్కోలు చెబుతున్నారు.ఇక 2013 వ సంవత్సరం నుంచే సానియా సింగిల్స్ ఆడటం మానేసింది. అప్పటి నుంచి ఆమె కేవలం డబుల్స్ మాత్రమే ఆడుతోంది. ఇండియన్ టెన్నిస్లో సానియా మీర్జా మహిళల టెన్నిస్కు ఓ ఇన్స్పిరేషన్ గా నిలిచింది. తన సుదీర్ఘ కెరీర్లో ఆమె ఎన్నో అరుదైన మైలురాళ్లను అధిగమించింది. డబుల్స్లో ప్రపంచ నెం.1 ర్యాంకును కూడా సాధించింది సానియా. ఏకంగా 91 వారాల పాటు డబుల్స్లో సానియా మీర్జా నంబర్వన్గా కొనసాగి తన సత్తాను చాటుకుంది.గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్కు చేరిన ఒపెన్ ఎరాకు చెందిన మూడవ మహిగా కూడా నిలిచింది సానియా. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు ఇంకా అలాగే ఆఫ్రో-ఆసియా క్రీడల్లో ఆమె 14 పతకాలను సాధించిన సానియా వాటిలో మొత్తం 6 బంగారు పతకాలను కూడా గెలుచుకుంది.