ఆట ఆడిన మొదటి సారే టైటిల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ను కూడా ఖచ్చితంగా మంచి విజయంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇక మంగళవారం నాడు అనగా ఈరోజు రెండో మ్యాచ్కు సిద్ధమైంది.తన ప్రత్యర్థి జట్టు అయిన దిల్లీ జట్టును వారి సొంత మైదానంలోనే గుజరాత్ ఎదుర్కోనుంది. అయితే.. అన్ని విభాగాల్లో కూడా చాలా బాగా రాణిస్తున్న హర్దిక్ పాండ్య జట్టుకు మాత్రం మ్యాచ్లో గాయం కారణంగా న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ అయిన కేన్ విలియమ్సన్ దూరమవడం నిజంగా చాలా పెద్ద లోటే. అయితే అతని స్థానాన్ని దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్తో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక డేవిడ్ మిల్లర్ కనుక వస్తే.. ఖచ్చితంగా ఆ జట్టుకు మరింత బలం అనేది చేకూరినట్లువుతుంది.మొదటి మ్యాచ్లో విలియమ్సన్.. బౌండరీ లైన్ వద్ద సిక్స్ను ఆపేందుకు ప్రయత్నించి గాయపడిన సంగతి తెలిసిందే. నొప్పితో ఎంతగానో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడగా.. ఇక అతడి స్థానంలో సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు.
ఇక మరోవైపు దిల్లీ ఫస్ట్ మ్యాచ్లో లఖ్నవూపై 50 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడం జరిగింది. ఈ రోజు గుజరాత్తో జరగనున్న మ్యాచ్లోనైనా ఖచ్చితంగా పెద్ద విజయం సాధించాలని చూస్తోంది. అయితే.. దిల్లీ టీం తమ పేస్ అటాక్ను ఖచ్చితంగా మెరుగుపర్చుకోవాలి. శుభ్మన్గిల్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ ఆటగాళ్లను అడ్డుకోవాలంటే ఖచ్చితంగా సరైన ప్రణాళికలతో బరిలోకి దిగాలి.గుజరాత్ జట్టు విషయానికి వస్తే..శుభ్మన్ గిల్, సాహా, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, జోష్ లిటిల్, షమీ ఇంకా సాయి సుదర్శన్ ప్లేయర్లు ఆడనున్నారు.దిల్లీ జట్టు విషయానికి వస్తే.. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, పావెల్,అమాన్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఆన్రిచ్ నార్జ్ ఇంకా అలాగే ఖలీల్ అహ్మద్ ప్లేయర్లు ఆడనున్నారు.