ధోనికి అసలైన వారసుడు అతడే : సెహ్వాగ్

praveen
రుతురాజ్ గైక్వాడ్.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ఈ ఆటగాడు గురించే సర్వత్ర అందరూ చర్చించుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన తర్వాతనే అతడికి జాతీయ జట్టులో అవకాశం దొరికింది. అప్పుడప్పుడు జాతీయ జట్టుకు ఆడుతున్న రుతురాజ్ ప్రస్తుతం ఐపీఎల్ 2023 ని సైతం చక్కగా మొదలు పెట్టాడు. 50 బంతుల్లో 92 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ కి తన సత్తా ఏంటో చూపించాడు. తొమ్మిది సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాది గుజరాత్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఇక ప్రస్తుతం రుతురాజు గైక్వాడ్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అతనిపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


ఇలాంటి ఒక ఆటగాడు ఇండియాకి చక్కగా సరిపోతాడు అని, మంచి ఆరంభాలను ఇవ్వగలడని, అలాగే ప్రతి బాల్ ని కొడుతూ మంచి స్కోర్ గా మార్చుతూ, ఫోర్లు, సిక్స్ లు కొట్టి పెద్ద స్కోర్ మలిచే సత్తా ఉన్నా బ్యాట్స్మెన్ అంటూ వీరేంద్ర సెహ్వా రుతురాజ్ ని కొనియాడాడు. ప్రస్తుతం ఇలాంటి సత్తా ఉన్నవారు టీమిండియా జట్టులో లేరంటూ తనదైన రీతిలో వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. అర్ధ శతకాలు బాదడం మాత్రమే కాదు. వాటిని సెంచరీలుగా మలిచే సత్తా ఉన్న  రుతురాజ్ అంటూ సెహ్వాగ్ తెలిపాడు.

రెండు సీజన్స్ గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగుతుండగా ఇప్పటికే ఒక సెంచరీ కూడా టీమిండియా తరఫున చేశాడు. అయితే టీమిండియాలో అతడికి చోటు దక్కకపోవడం తనని ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంటూ చెప్తున్నాడు సెహ్వాగ్. చాలా మంది ఆటగాళ్లు టీమిండియాలో అవకాశాలు దక్కించుకుంటున్నారు, కొంతమంది బాగా రాణిస్తున్నారు కూడా. అతడు మాత్రం ఎందుకు ఎదురు చూడాల్సి వస్తుందని చెబుతున్నాడు. ఇక ఈ సీజన్ బాగా ఆడితే రుతురాజ్ కి భారత్ టీం నుంచి ఖచ్చితంగా పిలుపు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా జోష్యం చెబుతున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ధోని లాంటి వ్యక్తి కి రుతురాజ్ ఒక మంచి వారసుడు అవుతాడు అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: