ఈ ప్రమోషన్ చూసి.. అశ్విన్ అభిమానులు కూడా షాకయ్యారు?
అయితే ఇటీవల కాలంలో కేవలం స్పిన్ బౌలింగ్లో మాత్రమే కాకుండా బ్యాటింగ్ లో కూడా రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం అతన్ని కేవలం బౌలర్గా పరిగణించాలి లేదంటే జట్టులో ఉన్న ఆల్ రౌండర్ల జాబితాలో చేర్చాలా తెలియక అటు విశ్లేషకులు సైతం కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. అయితే జట్టుకు కావలసిన ప్రతిసారి కూడా ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి అయినా సరే రవిచంద్రన్ అశ్విన్ సిద్ధంగా ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరకు భారత జట్టు తరఫున ఎన్నో స్థానాలలో బ్యాటింగ్ దిగి అదరగొట్టాడు. ఇక ఇటీవల ఐపీఎల్ లో అయితే ఏకంగా ఓపెనర్ గా అశ్విన్ రావడంతో అందరూ చూసి షాక్ అయ్యారు అని చెప్పాలి.
అయితే ఇప్పుడు వరకు టి20 ఫార్మాట్లో రవిచంద్రన్ అశ్విన్ తొలి ఓవర్ వేయడం చూసాం. కానీ ఐపీఎల్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ను ఏకంగా ఓపెనర్ బ్యాట్స్మెన్ గా బరిలోకి దింపారు. ఈ క్రమంలోనే యశస్వి జైశ్వాల్ తో కలిసి అతడు ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే 2013 లోను అతడు ఒకసారి ఓపెనింగ్ చేశాడు అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో అశ్విన్ పరుగులు ఖాతా తెరవకుండానే డక్ అవుట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు రాజస్థాన్ పై విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.