న్యూజిలాండ్ కు షాక్.. వరల్డ్ కప్ కి విలియమ్సన్ దూరం?

praveen
ఐపీఎల్ ప్రారంభానికి ముందు నుండే ఇక ఐపీఎల్ లోని కొన్ని జట్లను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. జట్టులో ఉన్న కీలక ప్లేయర్లు గాయాల బారిన పడుతూ చివరికి ఐపీఎల్ టోర్నీకి మొత్తం దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల గుజరాత్ టైటాన్స్ జట్టుకు కూడా ఇలాంటి షాక్ తగిలింది. ఎంతో అనుభవం ఉన్న కెన్ విలియమ్సన్  జట్టుకు ఉపయోగపడతాడు అని భావించి రెండు కోట్ల బేస్ ప్రైస్ తో జట్టులోకి తీసుకుంది గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం.


 కానీ ఊహించని రీతిలో కెన్ విలియమ్సన్  విషయంలో గుజరాత్ యాజమాన్యం ప్లాన్ మొత్తం తారుమారు అయింది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు కెన్ విలియమ్సన్. అయితే గాయం చిన్నదే అయి ఉంటుంది. మళ్లీ తర్వాత మ్యాచ్లో అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో అతను ఐపిఎల్ టోర్నీకి మొత్తం దూరం అయ్యాడు అని చెప్పాలి. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇక అతని మోకాలికి సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారట.


 దీంతో ఇక ఐపీఎల్ సీజన్ కి మొత్తం అతను దూరమయ్యాడు. అయితే గుజరాత్ టైటాన్స్ కి మాత్రమే కాదు అటు న్యూజిలాండ్ జట్టుకు కూడా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం న్యూజిలాండ్ వన్డే కెప్టెన్ గా ఉన్నాడు కెన్ విలియమ్సన్. అయితే ఈ ఏడాది భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే మరో మూడు వారాల్లో అతనికి సర్జరీ జరుగనుంది. దీన్ని బట్టి చూస్తే ఇక వరల్డ్ కప్ ప్రారంభం అయ్యేలోపు కేన్ విలియమ్స్ మళ్లీ ఫిట్నెస్ సాధించడం కష్టమే అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: