ఐపీఎల్ : పరువు మొత్తం పోయింది.. మొహం కూడా చూపించలేకపోయాడు?
మరి ముఖ్యంగా అటు చివరి ఆరు బంతుల్లో 29 పరుగులు కావాల్సిన సమయంలో గుజరాత్ విజయం ఖాయం అనుకుంటుండగా.. ఇక రింకు సింగ్ విధ్వంసం సృష్టించాడు అని చెప్పాలి. ఇక అతని బ్యాటింగ్తో బౌలర్కు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఏకంగా ఓకే ఓవర్ లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి పరుగులు పిండుకున్నాడు. అతనికి అవకాశం ఉండి ఉంటే ఇక ఆరో బంతి కూడా శిక్ష కొట్టేవాడేమో అని అనిపించింది. ఇక బౌలర్ యష్ దయాళ్ ఓవరాల్ గా నాలుగు ఓవర్లు వేసి 69 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే యష్ దయాల్ అత్యంత చెత్త రికార్డును కూడా నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్ల జాబితాలో యష్ దయాల్ రెండవ స్థానంలోకి చేరుకున్నాడు. ఈ లిస్టులో తొలి స్థానంలో బాసిల్ తంపి ఉన్నాడు. నాలుగు ఓవర్లలో 70 పరుగులు సమర్పించుకున్నాడు 2018లో ఆర్సిబి తో మ్యాచ్లో. ఇక మూడో స్థానంలో ఇషాంత్ శర్మ 2013లో సీఎస్కే తో మ్యాచ్లో 66 పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా ఉన్నాడు అని చెప్పాలి. ఇంత చెత్త ప్రదర్శన చేసిన ముఖం కూడా చూపించలేకపోయాడు యష్ దయాల్.