సూర్య.. కాస్త స్లోగా ఆడబ్బా : రవి శాస్త్రి

praveen
సాధారణంగా అయితే సూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో ఎంత విద్వాంసాకరమైన బ్యాట్స్మెనో అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన సత్తా ఏంటో చూపించి అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ గా ఎదిగాడు సూర్య కుమార్ యాదవ్. అద్భుతమైన ఆట తీరుతో ప్రపంచ క్రికెట్లో నయా మిస్టర్ 360 ప్లేయర్ గా కూడా అవతరించాడు అని చెప్పాలి. సహచర బ్యాట్స్మెన్లు అందరూ కూడా పరుగులు చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో  సూర్యకుమార్ యాదవ్ మాత్రం బౌండరీలు బాదుతూ పరుగుల వరద పారిస్తూ ఉంటాడు అని చెప్పాలి.



 అలాంటి సూర్య కుమార్ యాదవ్ మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్ లలో కూడా పరుగుల ఖాతా తెలవకుండానే డక్ అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు అన్న విషయం తెలిసిందే. అయితే వన్డే  ఫార్మాట్లో ఎలా ఉన్నప్పటికీ టి20 ఫార్మాట్లో మాత్రం సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తాడని అభిమానులు అనుకున్నారు. కానీ ప్రస్తుతం టి20 ఫార్మాట్లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదే వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు సూర్య కుమార్ యాదవ్.


 ఇక వరుసగా మ్యాచ్లలో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం సమయంలో సూర్య కుమార్ యాదవ్ కాస్త జాగ్రత్తగా ఆడాలని సూచించాడు రవి శాస్త్రి. సూర్య కుమార్ తప్పక పుంజుకుంటాడు. త్వరలోనే అది జరుగుతుంది. అయితే టీ20 క్రికెట్ అయినప్పటికి ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త సమయం తీసుకోవాలి అన్నది అతడికి నా సలహా.. అంటే నా ఉద్దేశం 20 నుంచి 30 నిమిషాలు కాదు.  6 లేదా 8 బంతులు జాగ్రత్తగా ఆడితే చాలు అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: