ఢిల్లీ వరుస ఓటములపై.. గంగూలీ ఏమన్నాడో తెలుసా?

praveen
2023 ఐపీఎల్ సీజన్లో ఎవ్వరి ఊహకందని రీతిలో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న టీం ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అని చెప్పాలి. ప్రతి సీజన్లో కూడా మంచి ఆట తీరుతో ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఇచ్చే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇక ఈ ఏడాది మాత్రం వరుస ఓటములతో సతమతమవుతుంది. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడింది అని చెప్పాలి. ఈ నాలుగు మ్యాచ్లలో ఒక్క దాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది.

 ఇలా ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్ లలో కూడా ఓడిపోయి ప్రస్తుతం పాయింట్లు పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రదర్శన పై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ విమర్శలు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాము. ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ సౌరబ్ గంగూలీ  కూడా స్పందించాడు. ఢిల్లీ జట్టు పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండి ఉంది. పుంజుకోవడానికి కాస్త సమయం పడుతుంది అంటూ అభిప్రాయపడ్డాడు సౌరవ్ గంగూలీ.

 ఏ టీం నైనా సరే ఓటమి కచ్చితంగా బాధపెడుతుంది. కానీ ఆటలో ఇవి మామూలే. ఓటమిని జీర్ణించుకోవడం ఎప్పుడు కష్టమే. మా జట్టులో చాలామంది కుర్రాళ్ళు ఉన్నారు. ఢిల్లీ జట్టు మంచి జట్టుగా ఎదగడానికి కాస్త సమయం పడుతుంది అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఇలా త్వరగా పుంజుకోవడానికి ఢిల్లీ ఆటగాళ్లు మార్గాలను అన్వేషించాలి అంటూ సలహా ఇచ్చాడు. తమ జట్టు బ్యాటింగ్ విభాగంలో మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా ఇప్పటికే నాలుగు మ్యాచ్లలో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ కనీసం తర్వాత మ్యాచ్ లలో అయినా గెలుస్తుందా లేదా అనే విషయంపై అటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: