నా కూతురు కోసమైనా.. టైటిల్ గెలుస్తా : రోహిత్ శర్మ

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్.. ప్రతి సీజన్లో కూడా అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ కు దూసుకు వెళ్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటి ముంబై ఇండియన్స్ ఇక ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత ఏడాది పేలవమైన ప్రదర్శన కారణంగా అటు పాయింట్లు పట్టికలో చిట్ట చివరన నిలిచింది. ఈ క్రమంలోనే అటు కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి.


 అయితే 2023 ఐపీఎల్ సీజన్లో అయినా ముంబై ఇండియన్స్ అద్భుతంగా పుంజుకుంటుంది అని అందరూ భావించారు.  కానీ ఊహించని రీతిలో ఛాంపియన్ జట్టుకు వరుస పరాజయాలు తప్పలేదు అని చెప్పాలి. వరుసగా మ్యాచ్లలో ఓడిపోతూ అభిమానులందరినీ కూడా నిరాశపరిచింది అని చెప్పాలి. దీంతో ముంబై ఇండియన్స్ పని అయిపోయినట్లేనా అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇక ఇటీవల మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి.


 ఇక ఈ మ్యాచ్ అనంతరం తన భార్య రితికాతో వీడియో కాల్ లో మాట్లాడిన రోహిత్ శర్మ మ్యాచ్ గెలిచిన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది. ట్రోఫీని చూస్తే మన కూతురు సమైరా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని రితిక చెప్పగా.. తప్పకుండా నా కూతురు కోసమైనా ట్రోఫీని తీసుకువస్తా అన్నాడు రోహిత్ శర్మ.  మ్యాచ్ గెలిచిన ఆనందంలో పెద్దగా అరిచేశాను. దాంతో నా వాయిస్ పోయింది అని సమైరా చెబితే.. నాక్కూడా మ్యాచ్ గెలిచిన ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్లో మొదటి విషయం సాధించిన ముంబై ఇండియన్స్ ఇక తర్వాత తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తుందని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: