ఐసీసీ కీలక నిర్ణయం.. క్రికెట్ లో కొత్త రూల్స్?

praveen
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో క్రికెట్ ప్రమాణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. క్రికెట్ ను మరింత రసవత్తారంగా మార్చేందుకు అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఎప్పటికప్పుడు రూల్స్ లో పలు మార్పులు తీసుకువస్తూ ఉంటుంది. ఇలా ఇప్పటివరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎన్నో కొత్త రూల్స్ తేరి మీదికి తీసుకువచ్చి అటు క్రికెట్ ఆట ప్రమాణాలను మరింత పెంచేసింది అనడంలో సందేహం లేదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఐసీసీ మరిన్ని కొత్త రూల్స్ తీసుకువచ్చేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది.



 అయితే ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీసుకు వస్తున్న కొత్త రూల్స్ లో మొదటిది సాఫ్ట్ సిగ్నల్ రూల్. అయితే ఇప్పుడు వరకు క్రికెట్లో కొనసాగిన సాఫ్ట్ సిగ్నల్ రూల్ ను రద్దు చేసింది ఐసిసి.  ఇదిఎంపైర్లకు కొత్త తలనొప్పిని తీసుకురాబోతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు క్యాచ్ అవుట్ విషయంలో లేదంటే రన్ ఔట్ విషయంలో ఇక అంపైర్లు  కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు సాఫ్ట్ సిగ్నల్ గా తమ నిర్ణయాన్ని ప్రకటించి.. ఇక థర్డ్ అంపైర్ కు రిఫర్ చేసేవారు ఫీల్డ్ అంపైర్లు. థర్డ్ అంపైర్ దానిని గమనించి తుది నిర్ణయాన్ని ప్రకటించేవారు. ఒకవేళ థర్డ్ అంపైర్ కూడా కన్ఫ్యూజన్లో ఉంటే ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సాఫ్ట్ సిగ్నల్ నే తుది నిర్ణయంగా ప్రకటించేవారు.


 ఇప్పుడు ఈ రూల్ రద్దు చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఆటగాళ్లు హైరిస్క్ పొజిషన్లో ఫీల్డింగ్  చేస్తున్న సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిబంధన తీసుకువచ్చింది ఐసీసీ. ఇక ఫ్రీ హిట్టు విషయంలో కూడా కొన్ని రూల్స్ సవరించింది. ఐసీసీ ఫ్రీ హిట్ సమయంలో బంతి స్టంప్స్ ను తాకినప్పుడు స్కోరు చేసిన .. లేదా బంతి బౌండరీ కి వెళ్ళినా కూడా పరుగులు పరిగణలోకితీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడుబంతి స్టంప్స్ తాకి ఫోర్ వెళ్లిన లేకపోతే బ్యాట్స్మెన్లు పరుగులు తీసిన పరుగనిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: