క్రిస్టియానో రొనాల్డో అద్భుత రికార్డు.. తొలి ప్లేయర్‌ అతడే?

praveen
అవును, ఫుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో మరో సరికొత్త చరిత్రకి శ్రీకారం చుట్టాడు. 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఫుట్ బాల్ ఆటగాడిగా రొనాల్డో ఏకంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. యూరో కప్-2024 క్వాలిఫయింగ్ టోర్నీలో మంగళవారం ఐస్ లాండ్‌తో మనోడు 200వ మ్యాచ్ ఆడడం విశేషం. ఆ మ్యాచ్‌లో పోర్చుగల్ 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఆ ఏకైక గోల్ కొట్టింది కూడా మన 38 ఏళ్ల రొనాల్డోనే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోర్చుగల్ తరఫున 200 మ్యాచ్‌లు ఆడే అవకాశం తనకు దక్కిన  అదృష్టంగా రొనాల్డో పేర్కొన్నాడు. తనకు ఫుట్ బాల్ ఆటపై, తన దేశంపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ స్టార్ ప్లేయర్ పేరు చెబితే చాలు.. సాకర్ అభిమానులు ఆనందంలో మునిగిపోతారు. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే క్రీడాకారుల్లో రోనాల్డో ఒకరు. అతడికి వారానికి దాదాపు రూ. 3 కోట్లకు పైగా చెల్లిస్తారు. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రొనాల్డో రికార్డుల్లోకెక్కాడు. తన జీవితంలో మిగిలిన కాలమంతా తాను ఆటను ఎంజాయ్ చేస్తూనే ఉంటానని.. మరో పదేళ్ల పాటు ఆడతానని రోనాల్డో చెప్పడం కొసమెరుపు. 'వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' టైటిల్‌ను రోనాల్డో త్రీ సార్లు గెలుచుకున్నాడు.

రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ నుంచి మాడ్రిడ్‌కు మారిన తర్వాత 8 సీజన్లలో 360 గేమ్స్ ఆడి 371 గోల్స్ సాధించాడు. ఈ క్లబ్‌లో ఇంతవరకు ఎవరూ చేయనన్ని గోల్స్ చేయడంతో 2009లోనే రికార్డు స్థాయి పారితోషికాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖులు మనోడిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక ముందు ఎవరు ఏం చెప్పాలన్నా.. రొనాల్డో కంటే ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందని మాడ్రిడ్ ప్రెసిడెంట్ ఫ్లోరెంటినో పెరెజ్ వ్యాఖ్యానించారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక మ్యాచ్‌లు కువైట్‌కు చెందిన బాదర్ అల్ ముతావా (196 మ్యాచ్ లు), మలేషియాకు చెందిన చిన్ అన్ (195), ఈజిప్ట్‌కు చెందిన అహ్మద్ హసన్ (184), భారత్‌కు చెందిన సునీల్ ఛెత్రీ (137 మ్యాచ్‌లు) ఆడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: