టి20 క్రికెట్లో ఇదొక తుఫాన్.. కసితీరా బాదారు?
టోర్నీలో భాగంగా సౌత్ గ్రూప్లో ఉన్న సర్రి, మిడిలేసెక్స్ మధ్య ఇటీవల మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కూడా భారీ స్కోర్ నమోదు చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు ఏకంగా 253 పరుగులు చేసింది. ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన మిడిలేసెక్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది అంటే ఇక బ్యాటింగ్ లో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఇరు జట్లలో ఎవరు సెంచరీలు చేయకపోయినప్పటికీ సిక్సర్లు బౌండరీలతో మాత్రం విరుచుకుపడి వీరవిహారం చేశారు. మ్యాచ్ మొత్తంగా 50 బౌండరీలు 24 సిక్సర్లు నమోదు అయ్యాయి.
ఈ క్రమంలోనే టి20 లాస్ట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేదించిన తొలి జట్టుగా మిడిలేసెక్స్ చరిత్ర సృష్టించింది. ఇక ఓవరాల్ గా టీ20 హిస్టరీలో ఇది రెండో అత్యధిక లక్ష్య చేదన కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన సర్రి జట్టు 20 ఓవర్ లో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బలిలోకి దిగిన మిడిలేసెక్స్ ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. బ్యాటింగ్ కీ వచ్చిన ప్రతి ఒక్కరు కసితీరా బాదారు. ఆఖరిలో మూడు బంతుల్లో 11 పరుగులు కావాల్సి ఉండగా.. అలవోకగా పరుగులు చేసి విజయం సాధించింది మిడిలేసెక్స్.