హమ్మయ్య.. ఇప్పుడు సంజూ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ?
ఈ క్రమంలోనే గత కొన్ని సీజన్స్ నుంచి నిలకడైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్న తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకి కూడా భారత జట్టులో చోటు దక్కింది. దీంతో అతని ఫాన్స్ అందరు సంతోషంగా మునిగిపోయారు. ఈ ఏడాది తన ఇన్నింగ్స్ లతో సంచలనం సృష్టించిన యశస్వి జైస్వాల్ కూడా టీమిండియాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి సంజు శాంసన్ విషయంలో సెలెక్టర్లు వివక్ష చూపుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే 2023 ఐపీఎల్ సీజన్లో మంచి ప్రదర్శన చేసిన సంజూను ఇక వెస్టిండీస్ పర్యటన కోసం జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది అని అందరూ అనుకున్నారు.
ఇక అందరూ అనుకున్నట్లుగానే వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో సంజు శాంసన్ కు చోటు దక్కింది అని చెప్పాలి. దీంతో అతని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి .ఎందుకంటే సంజూ శాంసన్ కి ఎప్పుడెప్పుడు టీమిండియాలో చోటు దక్కుతుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అతనికి అవకాశం రావడంతో అభిమానులు మురిసిపోతుండగా.. ఇక సెలక్టర్లు తమపై వచ్చిన విమర్శలను తగ్గించుకునే క్రమంలోనే సంజూకీ అవకాశం ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.