వేటుపడ్డాక.. ఆట మెరుగైంది.. పూజార సెంచరీ?
అయితే ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో వైఫల్యం కారణంగా పూజరాకు ఇక వెస్టిండీస్ పర్యటనలో ఆడబోయే టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేయలేదు. ఇక అతనిపై వేటు వేయడం గురించి అందరూ చర్చించుకున్నారు. అయితే ఇటీవల వేటుపడిన పూజార అటు దేశవాళి క్రికెట్లో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. ప్రస్తుతం దిలీప్ ట్రోఫీలో సెమీఫైనల్ పోరు లో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన పూజార.. 278 బంతుల్లో 133 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. ఇందులో 14 ఫోర్లు ఒక సిక్సర్ ఉండడం గమనార్కం. అతని సహచరులంతా అటు పెవిలియన్ క్యూ కడుతున్న సమయంలో తనకు అలవాటైన శైలిలో మరోసారి బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు పూజారా.
ఏకంగా క్రీజులో పాతుకుపోయి బౌలర్లను ఇబ్బంది పెట్టాడు అని చెప్పాలి. సెంట్రల్ జోన్తో జరుగుతున్న పోరులో ఓవర్ నైట్ స్కోర్ 149/3 తో మూడో రోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్ జోన్ ఆట ముగిసే సమయానికి 292/9 తో నిలిచింది. చివరి బంతికీ పూజార రన్ అవుట్ రూపంలో ఓపెన్ తిరిగాడు అని చెప్పాలి. కదాకాగా ఇదే మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ (52) పరుగులు చేసి హాఫ్ సెంచరీతో మెరిసాడు. సర్ఫరాజ్ ఖాన్ మాత్రం 6 పరుగులు చేసి విఫలమయ్యాడు. కాగా గతంలో ఇంగ్లాండ్ కౌంటి లలో ఇలాగే రానించి జట్టులోకి వచ్చాడు. కానీ భారత జట్టు తరఫున ఆకట్టుకోలేకపోయాడు. మరి ఇప్పుడు దేశ వాలి క్రికెట్లో రాణిస్తున్న పూజారకు మళ్ళీ సెలెక్టర్లు అవకాశం ఇస్తారు లేదో చూడాలి.