వాళ్లంతా గొప్ప క్రికెటర్లు.. అయినా గర్వం లేదు : తిలక్ వర్మ తండ్రి

praveen
భారత క్రికెట్లో మంచి టాలెంట్ ఉన్న యంగ్ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో తిలక్ వర్మ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అప్పటివరకు దేశవాళి క్రికెట్లో ఆడిన తిలక్ వర్మ పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే ఐపీఎల్ లో ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తరఫున ఎంపికయ్యాడో.. అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు అని చెప్పాలి. అంతేకాదు తనకు అవకాశం దొరికిన మొదటి సీజన్లోనే తిలక్ వర్మ తన ఆట తీరుతో ఇక తానే టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అన్న విషయాన్ని కూడా నిరూపించుకున్నాడు అని చెప్పాలి.


 ఎందుకంటే ఛాంపియన్ టీం లో ఉన్న సీనియర్లు అందరూ కూడా విఫలమవుతున్న వేళ.. ఐపీఎల్లో ఎలాంటి అనుభవం లేని తిలక్ వర్మ మాత్రం తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఎంతో నిలకడగా ఆడుతూ జట్టుకు మంచి స్కోర్ అందించాడు. దీంతో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అతని ఆటకు ముంబై ఫ్యాన్స్ అందరు కూడా ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇక ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్లోనూ అదే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు తిలక్ వర్మ. అయితే ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో హైదరాబాద్ లో  ముంబై ఇండియన్స్ ప్లేయర్ లందరూ మ్యాచ్ ఆడారు. అనంతరం హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ ఇంటికి వెళ్లారు ముంబై టీమ్.


 ఇలా తన ఇంటికి ముంబై ఇండియన్స్ ప్లేయర్లు రావడం గురించి తిలక్ వర్మ తండ్రి నాగరాజు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ఇంటికి ఇలా ముంబై ప్లేయర్లందరూ రావడం జీవితాంతం మర్చిపోలేను అంటూ చెప్పుకోచ్చారు నాగరాజు. ఆరోజు సచిన్, రోహిత్, సూర్య,  ఇషాన్ కిషన్ సహా 21 మంది వచ్చారు. నాలుగు గంటల పాటు ఇంట్లో సరదాగా గడిపారు. దమ్ బిర్యాని వాళ్లకు బాగా నచ్చింది. ఇక ఫేమస్ క్రికెటర్లు అయినా కూడా వాళ్లకు కాస్తయినా గర్వం లేదు. వాళ్లే సర్వ్ చేసుకుని ఇక కింద కూర్చుని భోజనం చేశారు అంటూ తిలక్ వర్మ తండ్రి నాగరాజు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: