ఐపీఎల్ వల్లే.. ఆటగాళ్ల కెరియర్ నాశనం అవుతుంది : కపిల్ దేవ్

praveen
గత కొంతకాల నుంచి టీమ్ ఇండియాను గాయాల పెడతా తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు గాయం బారిన పడి జట్టుకు దూరం అయి పోయారు. దీంతో ప్రధాన ప్రేయర్లు లేకుండానే టీమిండియా మేజర్ టోర్నీలలో ఆడుతూ ఉంది. ఈ క్రమంలోనే వైఫల్యంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది అని చెప్పాలి. కాగా గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ నుంచి టీమిండియాలో ఇదే పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ బుమ్రా అటు వెన్నునొప్పి గాయం కారణంగా జట్టుకు దూరమై దాదాపు పది నెలలు గడుస్తుంది. ఇప్పటివరకు అతను తిరిగి జట్టులోకి రాలేదు.


 ఇక మరి కొంతమంది ప్లేయర్లు ఐపీఎల్లో గాయపడి ఇక కొన్ని నెలలపాటు జట్టుకు దూరమయ్యారు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి కీలక ప్లేయర్లు ఇక జట్టుకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. అయితే ఇలా టీమ్ ఇండియా ఆటగాళ్లు వరుసగా గాయాలను బారిన పడుతూ జట్టుకు దూరం అవ్వడానికి కారణం కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ లు లేనప్పుడు విశ్రాంతి దొరికిన సమయంలో ఇక ఐపీఎల్ నిర్వసిస్తున్నారని.. ఆ సమయంలో ఇక క్రికెటర్లు విశ్రాంతి తీసుకోకుండా ఐపీఎల్ ఆడటం వల్ల గాయాల బెడద ఎక్కువవుతుంది అంటూ అభిప్రాయపడుతున్నారు.


 ఇక ఇప్పటికే ఐపీఎల్ గురించి పలుమార్లు విమర్శలు గుప్పించిన భారత లెజెండరి క్రికెటర్ కపిల్ దేవ్ ఇటీవల మరోసారి ఇదే విషయంపై స్పందించాడు. ఐపీఎల్ లాంటి టోర్నీలో ఆటగాళ్ల కెరీర్ నాశనం చేసే అవకాశం ఉంది అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. గాయాలు ఉన్న ఐపిఎల్ ఆడుతున్నారని.. కానీ టీమిండియా కు ఆడటం లేదు అంటూ ఎద్దేవా చేశారు. వరల్డ్ కప్ సమీపిస్తున్న ఇంతవరకు బుమ్రా భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకపోవడంపై బీసీసీఐని ప్రశ్నించారు.  బుమ్రా, పంత్ లాంటి ప్లేయర్లు ఉంటే టీమిండియా పటిష్టంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: