ఆండీ రాకతో..ఆర్సిబికి అదృష్టం కలిసి వచ్చేనా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవక పోయినప్పటికీ చాంపియన్ టీమ్స్ తో సమానంగా ప్రేక్షకాదరణ పొందుతున్న టీం ఏదైనా ఉందా అని ఐపీఎల్ అభిమానులను అడిగితే ఆ టీం మరీదో కాదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అని నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఐపీఎల్ హిస్టరీ లో ఒక్కసారి కూడా ఈ టీం టైటిల్ గెలవలేదు. ఇక పెద్దగా చెప్పుకొద్దగా ప్రస్థానాన్ని కూడా కొనసాగించలేదు. కానీ ఎందుకో బెంగళూరు జట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ప్రతి ఏడాది పెరిగిపోతూనే ఉంది. ఒకప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడినప్పుడు ఇక ఇప్పుడు ఫ్యాబ్ డూప్లెసెస్ కెప్టెన్ గా వచ్చిన తర్వాత కూడా ఆ జట్టుకు ఉన్న క్రేజ్ మారలేదు.


 అయితే అంతా బాగానే ఉంది కానీ కెప్టెన్లు మారిన బెంగళూరు జట్టు ఫేట్ మాత్రం అస్సలు మారడం లేదు  ప్రతిసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం ఇక లీగ్ మ్యాచ్లో మంచి ప్రదర్శన చేయడం నాకౌట్ మ్యాచ్లో చేతులెత్తేసి ఇక టోర్నీ  నుంచి నిష్క్రమించి విమర్శలు ఎదుర్కోవడం అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అలవాటుగా మారిపోయింది అని చెప్పాలి  అయితే ఇక వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది బెంగళూరు జట్టు యాజమాన్యం.


 ఈ క్రమంలోనే ఇక బెంగళూరు జట్టు కోచింగ్ సిబ్బందిలో అనూహ్యమైన మార్పులు చేసేందుకు సిద్ధమవుతుంది అన్నది తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హెడ్ కోచ్గా అండి ఫ్లేవర్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేసింది. దీంతో అభిమానులు అందరూ కూడా తెగ ఆనందపడిపోతున్నారు   ఆంటీ ఫ్లవర్ రాకతో బెంగళూరు జట్టుకు అదృష్టం వస్తుందని బలంగా నమ్ముతున్నారు. మరి బెంగళూరు 2024 ఐపిఎల్ సీజన్ లో ఎలాంటి ప్రస్థానం కొనసాగిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: