అది చెప్పడానికి.. నేను అస్సలు సిగ్గుపడను : సూర్య కుమార్

praveen
గత కొంతకాలం నుంచి వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న సూర్య కుమార్ యాదవ్.. ఇక ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో మాత్రం మళ్లీ తన మునుపటి ఫామ్ ను ప్రదర్శించాడు అన్న విషయం తెలిసిందే. 43 బంతుల్లోనే 84 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే టి20 ఫార్మాట్లో పరవాలేదు అనిపిస్తున్న సూర్య కుమార్ యాదవ్ అటు టి20 ఫార్మాట్లో మాత్రం ఎక్కడా ప్రభావం చూపలేకపోతున్నాడు అని చెప్పాలి. టీమిండియా అతనిపై నమ్మకం ఉంచి వరుసగా అవకాశాలు కల్పిస్తున్న అతను మాత్రం విఫలం అవుతూనే వస్తున్నాడు.


 ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ ఆట తీరుపై ఇక అటు భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. భారత క్రికెట్ లో ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ బాగా రాణిస్తూ ఉంటే ఎందుకు సెలెక్టర్లు ఇంకా సూర్యకుమార్ యాదవ్ ని పట్టుకుని వేలాడుతున్నారు అంటూ కాస్త ఘాటు విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే వన్డే ఫార్మాట్లో తన ప్రదర్శన గురించి ఇటీవల సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు సూర్య కుమార్.


 వన్డే ఫార్మాట్లో నా బ్యాటింగ్ గణంకాలు అస్సలు బాగాలేవు. దాన్ని అంగీకరించడానికి నేను సిగ్గుపడను. మన ప్రదర్శన గురించి నిజాయితీగా ఉండడం ఎంతో ముఖ్యం. అయితే ఆ రికార్డును ఎలా మెరుగుపరుచుకోవాలి అన్నది కూడా అంతే ముఖ్యం అంటూ సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. వన్డే ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడాలని కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ నాకు చెప్పారు. 10 నుంచి 12 ఓవర్లు ఆడగలిగితే జట్టుకు ఏం చేయగలవు ఆలోచించు అంటూ నాతో చెప్పారు. ఇక నీ శైలిలోనే ఆడమని స్వేచ్ఛ కూడా ఇచ్చారు. ఇప్పుడు అంతా నా చేతుల్లోనే ఉంది అంటూ సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: