వీడియో: ఇది క్రికెట్ లీగా.. పాముల లీగా.. తృటిలో తప్పించుకున్న ప్లేయర్?

praveen
లంక ప్రీమియర్ లీగ్ (LPL)లో క్రికెట్ విశేషాలు కంటే పాములే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. ఈ లీగ్ ప్రారంభమైన సమయం నుంచి మైదానంలోకి తాచుపాములు తరచుగా వస్తూ క్రికెటర్లకు భారీ షాక్స్ ఇస్తున్నాయి. తాజాగా ఒక పాము మైదానంలోకి రాగా అది  గమనించని ఫీల్డర్ అనుకోకుండా దానికి దగ్గరగా వెళ్ళాడు. రెండు, మూడు అడుగుల దూరంలో పాము ఉందనగా అతడు దానిని చూశాడు. వెంటనే ఉలిక్కిపడి దూరంగా వెళ్లిపోయాడు. అదే చూసుకోకుండా దాన్ని తొక్కినట్లయితే అతని ప్రాణాలు ప్రమాదంలో పడి ఉండేవి. ఆర్ ప్రేమదాస స్టేడియంలో బి-లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ సమయంలో మైదానంలోకి ఈ పెద్ద పాము వచ్చింది.

కింగ్స్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో బౌండరీకి సమీపంలో పేసర్‌ ఇసురు ఉదానా ఫీల్డింగ్‌ చేస్తుండగా, మైదానంలో పాకులాడుతున్న పామును గుర్తించాడు. ఉదానా పాము నుండి దూరంగా వెళ్లిపోయాడు. పామును మైదానం నుంచి తీసేయడానికి స్నేక్‌ క్యాచర్స్‌ వచ్చారు. ఆ సమయంలో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది. ఈ పాము మైదానంలోకి వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సీజన్‌లో LPL మ్యాచ్‌కి పాము అంతరాయం కలిగించడం ఇది మూడోసారి. ఈ సీజన్‌లో గాలే టైటాన్స్, దంబుల్లా ఆరా మధ్య జరిగిన రెండవ మ్యాచ్‌లో మొదటి సంఘటన జరిగింది. రెండో సంఘటన దంబుల్లా జెయింట్స్, కొలంబో స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగింది. మూడు వారాల్లో ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఆసియా కప్‌కు ముందు మైదానంలో పదే పదే పాములు కనిపించడంతో భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఆసియా కప్ ఒక ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్, ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతను నిర్ధారించడానికి నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి.

భద్రతా సమస్యలతో పాటు, పాము కనిపించడం వల్ల ఎల్‌పీఎల్‌లో ఆటకు కూడా అంతరాయం ఏర్పడింది. దీనివల్ల క్రికెటర్ల పర్ఫామెన్స్ పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. LPL అనేది ఒక ప్రముఖ టోర్నమెంట్. నిర్వాహకులు పాము సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతే ప్రధానంగా చూసుకోవాలి, పాముల వల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మైదానం నుంచి పాములను తొలగించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు, నిర్వాహకులు స్టేడియం చుట్టుకొలత చుట్టూ స్నేక్ ప్రూఫ్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: