అరెరే.. సన్రైజర్స్ వదులుకోబోతుంది.. అంతలోనే సెంచరీ చేశాడు?
ఒకప్పుడు జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగిన డేవిడ్ వార్నర్, కెన్ విలియమ్సన్ ను ఆ జట్టు యాజమాన్యం పక్కన పెట్టిన తర్వాత సన్రైజర్స్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే 2024 ఐపీఎల్ సీజన్ కోసం జట్టు ప్రక్షాళన చేయాలని సన్రైజర్స్ యాజమాన్యం భావిస్తుంది. ఈ క్రమంలోనే 2023 ఐపీఎల్ సీజన్లో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను పక్కకు పెట్టేందుకు సిద్ధమైంది. అయితే భారీ ధర పెట్టు కొనుగోలు చేసిన హరి బ్రూక్స్ ఎక్కడ జట్టుకు ఉపయోగపడలేదు. దీంతో అతన్ని పక్కన పెట్టేందుకు సిద్ధమైంది.
అయితే ఇలాంటి సమయంలోనే హ్యారి బ్రూక్స్ ఇటీవల ది 100 లీగ్ లో భాగంగా మెరుపు సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక ఇప్పుడు సెంచరీ తో అదరగొట్టిన మరో ఆటగాడిని సన్రైజర్స్ పక్కన పెట్టబోతుంది అన్నది తెలుస్తోంది. ఆటగాడు ఎవరో కాదు మయాంక్ అగర్వాల్. మహారాజా ట్రోఫీ 2023లో సూపర్ సెంచరీ చేశాడు మయాంక్ అగర్వాల్. మైసూర్ వారియర్స్ పై కళ్యాణి బెంగళూరు ప్లాస్టర్స్ ప్లేయర్ మయాంక్ కేవలం 57 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు. దీంతో అతని సెంచరీపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది అని చెప్పాలి. అయితే మయాంక్ ను కూడా భారీ ధర పెట్టుకున్న సన్రైజర్స్ అతను సరిగా ఆడకపోవడంతో వేలంలోకి వదిలేసేందుకు సిద్ధమైంది.