కేఎల్ రాహుల్ వల్ల.. మరొకరికి అన్యాయం జరుగుతుంది : మాజీ క్రికెట్

praveen
ఈ ఏడాది  భారత్ వేదికగా  వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఐసీసీ ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయగా.. ఇక వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ గెలవడమె లక్ష్యంగా బరిలోకి దిగేందుకు అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో అటు టీమిండియా కు ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. తప్పకుండా అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ను సాధించి విశ్వవిజేతగా నిలవాలని అనుకుంటుంది టీం ఇండియా. అయితే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే టీం ఇండియా ఆసియా కప్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఈనెల 30వ తేదీ నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ రెండవ తేదీన పాకిస్తాన్తో మొదటి మ్యాచ్ ఆడబోతుంది టీం ఇండియా. అయితే ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను అటు బీసీసీఐ ఆసియా కప్ కోసం ఎంపిక చేసింది. అయితే ఇందులో గత కొంతకాలం నుంచి గాయాల బారిన పడి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పేర్లు కూడా ఉండడం గమనార్హం. అయితే గాయం బారిన పడి కోలుకున్న ఈ క్రికెటర్లు.. ఇక నేరుగా టీమిండియాలోకి వస్తున్న నేపథ్యంలో ఫామ్ లో ఉంటారా లేదా అన్నది అనుమానం గానే మారింది. కాగా ఇద్దరు ప్లేయర్లను  ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ గా ఆసియా కప్ కోసం సెలెక్ట్ చేయడంపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి.


 ఇదే విషయంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. ఆసియా కప్ కోసం ఇటీవల టీమిండియాని ప్రకటించింది బీసీసీఐ. అయితే కేఎల్ రాహుల్ గాయంతో ఉన్న ఎందుకు ఎంపిక చేశారు అంటూ ప్రశ్నించాడు కృష్ణమాచారి శ్రీకాంత్. 18వ ప్లేయర్గా సంజూని తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తెలిపారు. సెలెక్టర్ల తీరుపై మండిపడ్డారు గాయంతో ఉన్న ఆటగాడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు ఇలా చేయడం వల్ల మరొక ప్లేయర్ కి ఛాన్స్ రాకుండా  అన్యాయం జరిగే అవకాశం ఉంది అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేసారూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: