వీరేంద్ర సెహ్వాగ్ కు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరో?

praveen
ఇండియా పేరును భారత్ గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అంటూ గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఇదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. భారత రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ప్రకారమే ఇండియా పేరును భారత్ అనే మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇలా ఇండియా పేరు మార్చడంపై అటు ఎంతో మంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారత్ అనే పేరు అటు మన దేశానికి గర్వకారణంగా ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అదే సమయంలో మరి కొంతమంది ఇంత సడన్గా మిగతా విషయాలన్నీ వదిలేసి దేశం పేరు మార్చడమే ముఖ్యమైన అంటూ విమర్శలు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 అయితే ఇదే విషయంపై అటు సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి క్రీడావుకారుల వరకు ఎంతోమంది స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక తనదైన శైలిలోనే కామెంట్ చేశాడు. అయితే అంతా బాగానే ఉంది కానీ అటు మాజీ క్రికెటర్ చేసిన కామెంట్స్ పై కోలీవుడ్ హీరో విష్ణు విశాల్  కౌంటర్ ఇవ్వడం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇంతకీ భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నాడో తెలుసా.. ఇండియా పేరును బ్రిటిష్ వారు పెట్టిన పేరు అని.. ఒక పేరు మనలో గర్వాన్ని నింపేలా ఉండాలని వీరేంద్ర సెహ్వాగ్ తనదైన రీతిలో కామెంట్ చేశాడు. అయితే ఇదే విషయంపై కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కూడా స్పందించాడు. అయితే ఇన్నాళ్లపాటు మన దేశం పేరు ఇండియా అనే ఉంటే మీకు గర్వంగా అనిపించలేదా అంటూ ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే వీరేంద్ర సెహ్వాగ్ కి కోలీవుడ్ హీరో కౌంటర్ ఇవ్వడం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: