సిగ్గుండాలి.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన షమి?

praveen
వరల్డ్ కప్ లో భాగంగా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది టీమిండియా. సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో ఇక ప్రత్యర్థులు అందరిని కూడా తమ ఫామ్ తో భయపెడుతుంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన టీమిండియా 8 ఇంట్లో కూడా విజయం సాధించి అదరగొట్టింది. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో విశ్వవిజేతగా నిలవడమే ఖాయం అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కలిగిస్తుంది. కాగా టీమిండియ ఆడబోయే తొమ్మిదో మ్యాచ్  నెదర్లాండ్స్ తోనే కావడంతో ఇక చిన్న టీం పై టీమ్ ఇండియా తప్పక విజయం సాధించి లీగ్ మ్యాచ్ లలో అన్నింటిలో కూడా విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించడం ఖాయం అని అ అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే స్వదేశంలో ఉన్న పిచ్ లపై ఉన్న అనుభవాన్ని మొత్తం అటు భారత ఆటగాళ్లు ఇక వరల్డ్ కప్ లో చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం వరల్డ్ కప్ లో టీమిండియా తిరుగులేని జట్టుగా మారిపోయింది. అంతా బాగానే ఉంది కానీ భారత జట్టు ప్రస్తుతం ఇలా వరుస విజయాలు సాధిస్తూ ఉంటే అటు పాకిస్తాన్ మాజీలు కొంతమంది చూసి అసలు ఓర్వలేక పోతున్నారు. కొంతమంది భారత జట్టు ప్రదర్శన పై ప్రశంసలు కురిపిస్తుంటే.. ఇంకొంతమంది మాత్రం ఏకంగా దారుణంగా విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం.


 ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా ఏకంగా భారత క్రికెటర్లకు అందరికీ ఇచ్చిన బంతి కాకుండా ప్రత్యేకమైన బంతులు ఇస్తున్నారని అందుకే వారికి ఎక్కువ స్వింగ్ లభిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ విషయంపై భారత బౌలర్ షమి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. సిగ్గుపడండి ఆటపై ఫోకస్ చేయండి. ఇలాంటి ఫాల్తూ బక్వాస్ మాటలు బంద్ చేయండి  ఐసిసి ప్రపంచ కప్ లోకల్ టోర్నమెంట్ కాదు  ఇదివరకు మీరు ఇలాంటి కామెంట్ చేస్తే వసీం అక్రమే ఖండించారు. మీ దేశ ఆటగాడిపై మీకు నమ్మకం లేకపోతే ఎలా అని ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు షమీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: