మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం.. తల ఎత్తుకోండి : కపిల్ దేవ్
అయితే ఇలా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిపోవడంతో 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా టీమిండియా ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే రిపీట్ అవుతూ వస్తుంది. లీగ్ దశలో బాగా రానిస్తే.. ఇక నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం చేతులెత్తేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. కానీ ఆ తర్వాత ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ఎంత అద్భుతమైన ప్రస్థానం కొనసాగించిందో అన్న విషయాన్ని అర్థం చేసుకొని.. ఇక బాధలో ఉన్న టీమిండియాకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది మాజీ ప్లేయర్లు సైతం టీమ్ ఇండియా ప్లేయర్ల బాధని పోగొట్టడానికి మద్దతు ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిపై టీమిండియా కు మొదటి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్.. దిగ్గజా ప్లేయర్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మీ ప్రదర్శన పట్ల దేశం హర్షిస్తుంది. ఛాంపియన్స్ లాగా ఆర్డర్ సగర్వంగా తల ఎత్తుకొండి. మీ మెదడులో ట్రోఫీ తప్ప మరో ఆలోచన లేదు. మీరు ఎప్పుడో విజేతలుగా నిలిచారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుంది. ఇది కష్టకాలం అని తెలుసు. కానీ స్ఫూర్తిని కోల్పోవద్దు యావత్ భారత్ మీకు మద్దతుగా నిలుస్తుంది అంటూ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా ఫైనల్ ఉత్కంఠ భరితంగా జరగ్గా. ఆస్ట్రేలియా విజయం సాధించి ఆరోసారి వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్గా అవతరించింది.