వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. ప్రపంచ రికార్డు?

praveen
ఇండియా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్నాయి. అయితే ఈ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా జట్టు సొంత గడ్డమీదనే టీమ్ ఇండియాని ఓడించి తన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఆరోసారి టైటిల్ విజేతగా నిలిచి విశ్వవిజేతగా అవతరించింది అని చెప్పాలి  అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈసారి విశ్వవిజేతగా నిలవబోయే టీం ఏది అన్నవిషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపుగా.. ఫైనల్ మ్యాచ్ ముగియడంతో ఇక ఈ ఉత్కంఠకు తెరపడింది.


 అయితే ఈ మ్యాచ్ జరిగే రోజులు గడుస్తున్నాయ్. ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన చర్చ మాత్రం అస్సలు ఆగడం లేదు. అయితే ఇక ఆ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో.. జరిగిన ఫైనల్ మ్యాచ్ ను ఏకంగా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ ఓటిటి వేదికగా 5.9 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించారు. అయితే ఇప్పటివరకు ఏ క్రికెట్ మ్యాచ్ ని కూడా ఈ రేంజ్ లో ప్రేక్షకులు వీక్షించలేదు. దీంతో ఇదే హైయెస్ట్ వ్యూయర్షిప్ గా రికార్డు సృష్టించింది. అయితే కేవలం ఓటిటి ప్లాట్ ఫామ్ లో మాత్రమే కాదు టీవీలో సైతం 30 కోట్ల మందికి పైగానే ఈ ఫైనల్ మ్యాచ్ వీక్షించారట.


 ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు బీసీసీఐ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న జై షా తన సోషల్ మీడియా వేదిక ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇండియన్ టీవీ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్ గా ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రికార్డ్ సృష్టించింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో 5.9 కోట్ల మంది లైవ్ లో చూశారని చెప్పుకొచ్చాడు. క్రీడల పట్ల భారత్ అభిమానుల ప్రేమ ఆదరణలకు తాము ఎప్పుడు వినయపూర్వకంగా ఉంటాము అంటూ జై షా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: