మళ్లీ ముంబై ఇండియన్స్ లోకి హార్దిక్.. ఫ్యాన్స్ షాక్?

praveen
ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ తర్వాత ఇక భారత జట్టుకు ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా హార్థిక్ పాండ్యా పేరు చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే రోహిత్ డిప్యూటీగా హార్దిక్ అదరగొట్టేస్తున్నాడు. రోహిత్ కు రెస్ట్ ఇచ్చిన సమయంలో తాత్కాలిక కెప్టెన్గా జట్టు బాధ్యతలు చేపడుతూ ఇక టీమిండియాను విజయపతంలో ముందుకునడిపిస్తున్నాడు. దీంతో అందరిలో అతనే ఫ్యూచర్ కెప్టెన్ అనే నమ్మకాన్ని కలిగించాడు. అయితే అంతకుముందు అసలు కెప్టెన్సీ రేస్ లోనే లేని హార్దిక్.. ఒక్కసారిగా టీమిండియా కెప్టెన్సీ రేస్ లోకి రావడానికి కారణం ఐపిఎల్ అని చెప్పాలి.


 ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఎన్నో ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన హార్దిక్ పాండ్య.. ఆ తర్వాత టీం నుంచి తప్పుకుని గుజరాత్ జట్టులోకి వెళ్ళాడు. ఇక కెప్టెన్సీ కూడా చేపట్టాడు. మొదటి ప్రయత్నంలోనే గుజరాత్ ను టైటిల్ విజేతగా నిలిపాడు. దీంతో అతని కెప్టెన్సీ నైపుణ్యం చూసి అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇక భారత కెప్టెన్సీ రేస్ లో కూడా అతని పేరు ముందు వరుసలోకి వచ్చేసింది . అయితే ఇక రెండో ప్రయత్నంలో కూడా అటు గుజరాత్ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు హార్థిక్ పాండ్యా. దీంతో సారధ్య బాధ్యతలను భుజానా వేసుకొని  టీం ని ముందుకు నడిపించడంలో అతనికి తిరుగులేదు అని మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపించారు.


 అలాంటి హార్దిక్ పాండ్య ఇక ఇప్పుడు ఏకంగా గుజరాత్ టైటాన్స్ వీడబోతున్నాడు అన్న వార్త అభిమానులు అందరిని కూడా షాక్ కి గురిచేస్తుంది. అతను గుజరాత్ ను వీడి మళ్లీ తన పాత టీమ్ అయిన ముంబై జట్టులోకి రాబోతున్నాడట. ఇందుకోసం ఆల్ క్యాష్ డీల్ కింద గుజరాత్ టైటన్స్ కి ముంబై ఇండియన్స్ ఏకంగా 15 కోట్ల రూపాయలు చెల్లించబోతుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే అతను గుజరాత్ టీం తరపున కొనసాగితే బాగుంటుందని.. ఎందుకంటే జట్టు కెప్టెన్సీ అతని చేతిలోనే ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: