కెప్టెన్ రోహిత్ పై.. సంజూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
సంజు శాంసన్.. ఈ కేరళ క్రికెటర్ పేరు గత కొంతకాల నుంచి భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది. ఎందుకంటే ఇతని విషయంలో సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరు.. ఎవరికీ నచ్చడం లేదు అని చెప్పాలి. అయితే ఐపీఎల్లో రాజస్థాన్ కెప్టెన్ గా ఇక కేరళ స్టేట్ టీం కెప్టెన్ గా కొనసాగుతున్నాడు సంజు శాంసన్.  వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ గా అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్ కి అటు టీమ్ ఇండియాలో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇతని కంటే వెనకాల వచ్చిన యువ ఆటగాళ్లకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్న సెలెక్టర్లు సంజు శాంసన్ ను మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు.


 గతంలో ఆసియా కప్, ఏసియన్ గేమ్స్ లాంటి టోర్నీలకు ఇక అతన్ని జట్టు సెలెక్షన్లో పరిగణలోకి కూడా తీసుకోని సెలెక్టర్లు.. ఇక వరల్డ్ కప్ లో అయితే కనీసం పట్టించుకోలేదు. అయితే ఈ పెద్ద టోర్నీలలో పట్టించుకోకపోయినా కనీసం ద్వైపాక్షిక సిరీస్లలో అయినా అతనికి చోటు కల్పిస్తారేమో అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ అది కూడా జరగడం లేదు. దీంతో ఇక అటు సంజూకీ నిరాశ ఎదురవుతుంది  ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్ కి కూడా సంజుకి మొండి చేయి ఎదురయింది అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల కేరళ క్రికెటర్ సంజు శాంసన్.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తనతో మాట్లాడటానికి.. ముందు వరుసలో ఉండే వ్యక్తుల్లో ఒకరు అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేస్తున్నావు అంటూ రోహిత్ ప్రశంసించాడు. ముంబై జట్టు మీద ఎక్కువ సిక్సర్లు కొట్టారు.  బ్యాటింగ్ బాగుంది అంటూ కొనియాడాడు అంటూ సంజు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు సంజు. ఇలా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి తనకు గొప్ప మద్దతు ఉంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: