ఒకే రోజు 23 వికెట్లు.. సచిన్ రియాక్షన్ వైరల్?
పేస్ బౌలర్లకు కేఫ్ టౌన్ పిచ్ బాగా సహకరిస్తూ ఉండడంతో ఇక ఇరు జట్ల బ్యాట్స్మెన్లు ఫేస్ బౌలింగ్ ఎదుర్కోవడానికి నానా తంటాలు పడుతున్నారు. చివరికి పరుగులు కూడా చేయలేక.. వికెట్ సమర్పించుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 55 పరుగులకే ఆల్ అవుట్ అయి అందరిని ఆశ్చర్యపరిచి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇక ఆ తర్వాత 153 పరుగులు చేసిన భారత జట్టు కాస్త కుదురుకున్నట్లు కనిపించినప్పటికీ.. ఇక చివర్లో ఏకంగా 11 బంతుల్లో ఆరు వికెట్లను కోల్పోయి ఒక్కసారిగా అందరినీ షాక్ లో ముంచేసింది అని చెప్పాలి.
టీమిండియా ఆల్ అవుట్ అయిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇలా కేవలం ఒకేరోజు ఇరు జట్ల పేసర్లు 23 వికెట్లు సాధించారు. అయితే ఇదే విషయంపై స్పందించిన క్రికెట్ దిగజం సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకేరోజు 23 వికెట్లతో ఈ ఏడాది ప్రారంభమైంది. ఇది నిజంగా జరిగినట్టు అనిపించడం లేదు. నేను సౌత్ ఆఫ్రికా ఆల్ అవుట్ అయినప్పుడు ఫ్లైట్ ఎక్కాను. ఇక ఇప్పుడు ఫ్లైట్ దిగి ఇంటికి చేరుకొని.. టీవీ పెట్టి చూసేసరికి సౌత్ ఆఫ్రికా మరో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మధ్యలో నేను ఏం మిస్ అయ్యాను అంటూ పోస్ట్ పెట్టాడు.