ఆంధ్ర క్రికెట్ జట్టుకు భారీ షాక్.. అతను కెప్టెన్సీకి రాజీనామా?
దేశవాళి క్రికెట్ లో మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ సెలెక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పాలి. ఇక టీమ్ ఇండియాలో అతన్ని చూసి చాలా రోజులైంది. కాగా దేశవాళి టోర్నీలు అయినా రాంజీ ట్రోఫీతో పాటు విజయ్ హజారే ట్రోఫీలలో మాత్రం అటు ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు హనుమ విహారి. అయితే ఇటీవల హనుమ విహారికి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా వరుసగా మ్యాచ్ లు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల హనుమ విహారి ఏకంగా ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడట.
ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. రంజీ ట్రోఫీ 2024లో ఆంధ్ర జట్టుకు తొలి మ్యాచ్ కు హనుమ విహారి సారధ్యం వహించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ముంబైతో జరగబోయే మ్యాచ్ కి మాత్రం అతను సారాధ్య భాద్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం. దీంతో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ రికీ భూయ్ నీ ఇక ఆంధ్ర జట్టుకు కొత్త కెప్టెన్ గా నియమించింది. బయట వ్యక్తుల ఒత్తిడి వల్ల విహారిని సెలెక్టర్లు తప్పించారని ఆరోపణలు రాగా బ్యాటింగ్ పై దృష్టి పెట్టడానికి అతను సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు అంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.