టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక.. ఇప్పటికే 95% ఖరారు : మాజీ సెలెక్టర్
ఫైనల్ వరకు ఒక్క ఓటమి లేకుండా దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి మళ్ళీ నిరాశ మిగిల్చింది. అయితే ఇక ఇప్పుడు 2024 t20 వరల్డ్ కప్ లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత జట్టు. కాగా వెస్టిండీస్ యూఏఈ వేదికలుగా ఈ ప్రపంచ కప్ టోర్నీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే 14 నెలల నుంచి టి20 ఫార్మాట్ కు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీలు మళ్లీ పొట్టి ఫార్మట్ లో చేరడంతో ప్రస్తుతం టీమిండియా ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే t20 వరల్డ్ కప్ లో ఎవరు జట్టులో స్థానం సంపాదించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక ఇదే విషయం గురించి భారత మాజీ సెలెక్టర్ దీప్దాస్ గుప్తా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జరిగే వెస్టిండీస్, అమెరికా పిచ్ లు బ్యాటింగ్కు సహకరించవు అంటూ తెలిపాడు. 160 - 170 పరుగులు చేయడమే అక్కడ కష్టమవుతుంది అంటూ అభిప్రాయపడ్డాడు. అందుకే భారత జట్టులో యువకులతో పాటు సీనియర్లు కూడా ఉండాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జట్టులో ఉంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది అంటూ తెలిపాడు. హిట్ మ్యాన్ టీం ను నడిపించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ప్రపంచ కప్ జట్టు కూర్పు 90% పూర్తయింది అని అనుకుంటున్నా అంటూ మాజీ సెలెక్టర్ దీప్ దాస్ గుప్తా చెప్పుకొచ్చాడు.