టీమిండియాకు ఇక్కడ నిరాశ.. అక్కడ ఆనందం?
ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో భారత జైత్రయాత్రకు బ్రేక్ వేసే టీం లేకుండా పోయింది అని చెప్పాలి. ఇటీవల యూఎస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 201 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది టీమిండియా. ఇక ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించి పాయింట్లు పట్టికలో టాప్ లో కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే భారత కుర్రాళ్ల జోరు చూస్తుంటే ఈసారి కూడా టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు ఇక అదే స్థాయిలో ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి.
అయితే ఇటీవల యూఎస్ఏ తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు తొలిత బ్యాటింగ్ చేసింది ఈ క్రమంలోనే నిర్ణీత 50 ఓవర్లలో 326 పరుగులు చేసింది టీమిండియా కుర్రాళ్ళ జట్టు. అయితే భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన యూఎస్ఏ జట్టు ఏ దశలో కూడా టీమిండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలోనే 50 ఓవర్లలో 125 / 8 పరుగులకు మాత్రమే పరిమితమైంది. కాగా ఇండియా బౌలర్లలో నితీష్ తివారి నాలుగు వికెట్లతో సత్తా చాటాడు అని చెప్పాలి. వరుసగా మూడు విజయాలు సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది.