విజయమే కాదు.. చరిత్ర సృష్టించిన సన్రైజర్స్?
అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రస్తుతం అటు సన్రైజర్స్ బ్యాటింగ్ విభాగం చెలరేగిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని సన్రైజర్స్ బాటర్లు విధ్వంసమే సృష్టిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాగే చెలరేగిపోయారు. ముఖ్యంగా ఆరు ఓవర్లు ముగిసేసరికి ఏకంగా 125 పరుగులు చేశారు. సన్రైజర్స్ ఓపెనర్లు దీన్నిబట్టి వారి విధ్వంసం ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 266 పరుగులు చేశారు. అయితే ఈ మ్యాచ్ లో అటు ఢిల్లీ క్యాపిటల్స్ కావడం 199 పరుగులకు మాత్రమే ఆల్ అవుట్ కావడంతో చివరికి 67 పరుగులు తేడాతో సన్రైజర్స్ విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ లో విజయం మాత్రమే కాదు అటు సన్రైజర్స్ ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో 250 ప్లస్ స్కోరు మూడుసార్లు చేసినా ఏకైక జట్టుగా నిలిచింది సన్రైజర్స్. గతంలో ఆర్సిబి రెండుసార్లు ఈ ఘనతను సాధించింది. కానీ అటు సన్రైజర్స్ మాత్రం మూడుసార్లు ఇలా 250 ప్లస్ స్కోరు చేయడం గమనార్హం. ఆర్ సి బి తో జరిగిన మ్యాచ్లో 287 ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 277 ఇక ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో 266 పరుగులు చేసింది సన్రైజర్స్ జట్టు. ప్రస్తుతం సన్రైజర్స్ దూకుడు చూస్తుంటే రెండోసారి టైటిల్ విజేతగా నిలిచే లాగానే కనిపిస్తుంది.