ఇక ఆ దేవుడే కాపాడాలి.. పాకిస్తాన్ మాజీ షాకింగ్ కామెంట్స్?
పాకిస్తాన్ జట్టు సూపర్ 8 కి చేరుకోవాలి అంటే కేవలం ఆ జట్టు విజయాలపై కాదు ఇతర జట్ల గెలుపు ఓటముల పైన కూడా ఆధారపడి ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా పాకిస్తాన్ జట్టు చెత్త ప్రదర్శన చేస్తూ ఉండడం పై మాట్లాడిన ఆ జట్టు మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యాడు. భారత్ చేతిలో ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. చాలా విషయాలు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఇది జట్టుకు నిజంగా బాధాకరం. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచి ఉండాల్సింది. బంతికో పరుగు చేయాల్సిన స్థితిలో కూడా జట్టు విజయం అందుకోకపోవడం నిజంగా దారుణం .
47 బంతులు 46 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో కూడా చేతిలో ఏడు వికెట్లు ఉన్న పాకిస్తాన్ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఈ ఫలితం పై నేను ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇక ఈ ఓటమితో పాకిస్తాన్ మొత్తం బాధలో మునిగిపోయింది. వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని.. ఆట ప్రారంభంలోనే చెప్పాను. ఒకరి కోసం ఒకరు ఆడాలని దేశం కోసం ఆడాలని చెప్పాను. ఈ మ్యాచ్లో గెలవాలనే పట్టుదల పాకిస్తాన్ లో ఎక్కడ కనిపించలేదు. కేవలం వ్యక్తిగత మైలురాళ్ల కోసం మాత్రమే ఆటగాళ్లు ఆడినట్లు కనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ సూపర్ 8 కి అర్హత సాధిస్తుందో లేదో అనేది సందేహంగా మారింది. ఆ దేవుడికి మాత్రమే తెలుసు అంటూ షోయబ్ అక్తర్ బావోద్వేగానికి గురయ్యాడు.