ఒక్క ఇన్నింగ్స్ తో.. 3 రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్?
దీంతో టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలవాలి అంటే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఫామ్ లోకి రావడం ఎంతో ముఖ్యం అని అభిమానులు అందరూ కూడా భావించారు. అయితే ఇక కీలకమైన మ్యాచ్ లో మాత్రం రోహిత్ శర్మ తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించారు. ఆస్ట్రేలియా తో జరిగిన పోరులో ఏకంగా 92 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు ఏడు ఫోర్లు ఉన్నాయి అని చెప్పాలి. ఒకరకంగా ఆస్ట్రేలియా బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు రోహిత్ శర్మ. ఇక ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా కూడా ఘన విజయాన్ని సాధించింది.
అయితే ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 92 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ ఓకే ఇన్నింగ్స్ తో ఏకంగా ఒకేరోజు మూడు రికార్డులను బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియా పై ఊచకోతతో అంతర్జాతీయ టి20 లలో అత్యధిక పరుగులు 4165 చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో బాబర్ 4,145, కోహ్లీ 4,13 పరుగులతో ఉన్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ప్రత్యర్తిపై అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా కూడా నిలిచాడు రోహిత్. ఆస్ట్రేలియాపై 132 సిక్సర్లు కొట్టాడు. మరోవైపు అంతర్జాతీయ టి20 క్రికెట్ లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇలా ఒక్క ఇన్నింగ్స్ తో ఏకంగా మూడు రికార్డులను బద్దలు కొట్టేశాడు.