ప్చ్.. రోహిత్ ఫ్యాన్స్ కు నిరాశ?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా జరుగుతున్న t20 ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. అంచనాలకు మంచి రాణిస్తూ అదరగొట్టేస్తోంది. ఒక్క ఓటమి కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఒక రకంగా ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది అని చెప్పాలి. బౌలింగ్ బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా జట్టు అదరగొట్టేస్తుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి సూపర్ 8లో అవకాశం దక్కించుకున్న టీమిండియా.. సూపర్ 8 లో కూడా అదరగొట్టేసింది. ఇక్కడ వరుసగా మూడు విక్టరీలు సాధించింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ లో పెద్దగా రాణించలేక ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మాత్రం అదరగొట్టేసాడు.  బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. ఏకంగా 92 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.

 కానీ రోహిత్ అభిమానులు మాత్రం రోహిత్ ఇన్నింగ్స్ చూసి నిరాశ పడుతున్నారు. ఎందుకంటే 92 పరుగుల వద్ద ఆగిపోయిన రోహిత్ శర్మ.. మరో ఎనిమిది పరుగులు చేసి ఉంటే సెంచరీ పూర్తి చేసేవాడు అని అనుకుంటున్నారు. కాగా అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి అని చెప్పాలి. దీంతో సెంచరీ చేస్తాడు అంటూ సెలబ్రేషన్స్ కి సిద్ధంగా ఉన్న రోహిత్ అభిమానులు అతను క్లీన్ బౌల్ అవ్వడంతో వచ్చేవరికి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.  ఇలా సెంచరీ చేసి ఉంటే టి20 ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును రోహిత్ శర్మ సృష్టించేవాడు. కానీ కొద్దిలో రికార్డు మిస్ అయ్యాడు. అయితే ప్రస్తుతం రోహిత్, మాక్స్వెల్ చెరో ఐదు సెంచరీలు చేసి తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: