మేమిద్దరం ఒక్కసారిగా ఏడ్చేసాం : కోహ్లీ
ఇక భారత జట్టు సాధించిన ఈ అఖండ విజయంపై 140 కోట్ల మంది భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల స్వదేశానికి వరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా ఎంట్రీ ఇచ్చింది. దీంతో వారికి ఘనస్వాగతం లభించింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఇలా వరల్డ్ కప్ సాధించిన టీమిండియా ఆటగాళ్లు అందరితో కూడా ముంబైలో విక్టరీ పరేడ్ నిర్వహించి ఒక భారీ రోడ్ షో నిర్వహించగా.. అభిమానులు భారీగానే తరలివచ్చారు. దీంతో ఇక ఈ రోడ్ షో అభిమానులు అందరితో కూడా కిక్కిరిసిపోయింది అని చెప్పాలి అదే సమయంలో ముంబై లోని వాంకడే స్టేడియంలో ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ఏర్పాటు చేశారు.
ఇక ఈవెంట్లో మాట్లాడిన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర బాబోద్వేగానికి గురయ్యాడు అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు మేమిద్దరం దాదాపు 15 సంవత్సరాలుగా టీమిండియా తరఫున కలిసి ఆడుతున్నాము. అయితే ప్రపంచ కప్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేదే మా కల. ఇక వరల్డ్ కప్ గెలవగానే రోహిత్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అతన్ని అలా చూడటం మొదటిసారి. ఇక ఇద్దరం కూడా ఒకరిని ఒకరం ఆలింగణం చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాం అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇలా వరల్డ్ కప్ గెలిచిన రోజునే నేను నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను అంటూ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.