భారత క్రికెటర్ ముఖంపై రక్తపు మరకలు.. అసలేం జరిగిందంటే?

praveen
ప్రస్తుతం భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక లంక పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో కూడా సిరీస్ లు ఆడబోతుంది. కాగా నిన్న ఏకంగా టి20 సిరీస్ ప్రారంభమైంది. కొత్త కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సారథంలో టీమిండియా ఇక ఈ టి 20 సిరీస్ లో బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మ్యాచ్ లో ఘనవిజయాన్ని కూడా అందుకుంది భారత జట్టు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఉత్కంఠ భరితమైన పోరులో అటు భారత జట్టు దే పై చేయిగా నిలిచింది అని చెప్పాలి. కాగా శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ లో ఛాన్స్ దక్కించుకున్న ఎంతోమంది యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు.



 ఒకవైపు బ్యాట్స్మెన్ అందరూ కూడా వీరబాదుడు బాధితే ఇంకోవైపు బౌలర్లు తమ బౌలింగ్ తో ఇక ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను పనికించారు అని చెప్పాలి. ఇలా అన్ని విభాగాల్లో అటు శ్రీలంకపై పైచేయి సాధించిన టీమ్ ఇండియా మొదటి టీ20 మ్యాచ్ లోనే ఘన విజయాన్ని సాధించి 1-0 తేడాతో ఆదిక్యాన్ని  సంపాదించుకుంది అని చెప్పాలి. అయితే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా భారత యంగ్ బౌలర్ మొహానికి గాయం అయింది. ఏకంగా రక్తం కూడా కారింది. ఇది చూసి భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు అని చెప్పాలి.


 శ్రీలంకతో జరిగిన తొలి t20 భారత యంగ్ బౌలర్ రవి బిష్ణయ్ గాయపడ్డాడు. 16 ఓవర్ లో అతను వేసిన తొలి బంతిని లంక బ్యాట్స్మెన్  మొండిస్ షాట్ కొట్టాడు. అయితే దాన్ని రిటర్న్ క్యాష్ అందుకునేందుకు రవి బిష్ణయ్ ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు అతనికి గాయమైంది. బంతిని అందుకునే క్రమంలో అతని కంటి కింద బలంగా బంతి తాకింది. దీంతో ముఖంపై రక్తం మరకలు అయ్యాయి. ఇక ఆ తర్వాత బ్యాండేజ్ వేసుకుని ఆటను కొనసాగించిన బిష్ణయ్ చివరి బంతికి అసలంకను పెవిలియన్ పంపించాడు. కాగా అతని డెడికేషన్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: