
ఐపీఎల్ : అదరగొట్టిన ఆటో డ్రైవర్ కొడుకు?
రోహిత్ శర్మ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన పుతూర్, రాగానే తన మ్యాజిక్ చూపించాడు. తొలి ఓవర్లోనే సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను బోల్తా కొట్టించాడు. డేంజర్ గా మారుతున్న గైక్వాడ్ను విల్ జాక్స్ చేతికి చిక్కేలా చేశాడు. అంతే కాదు, ఆ తర్వాత శివమ్ దూబేను కూడా లాంగ్ ఆన్లో తిలక్ వర్మ చేతికి క్యాచ్ ఇచ్చేలా చేసి పెవిలియన్ పంపాడు. ఇంకా ఆగకుండా దీపక్ హూడాను కూడా 3 పరుగులకే అవుట్ చేసి మూడు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. పుతూర్ కేవలం 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం ముంబై టీమ్ కు ఈ మ్యాచ్లో ఒకే ఒక్క మంచి విషయం అని చెప్పాలి.
పుతూర్ ఇంకా కేరళ సీనియర్ టీమ్ కోసం కూడా ఆడలేదు. కానీ అండర్-14, అండర్-19 స్థాయిలో మాత్రం కేరళకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్లో అలెప్పీ రిప్పిల్స్ తరపున ఆడుతున్నాడు. అంతేకాదు తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) లో కూడా తన సత్తా చాటాడు.
పుతూర్ క్రికెట్ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. అతను ఒక ఆటో డ్రైవర్ కొడుకు, అమ్మ గృహిణి. అతను మొదట్లో మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు. కానీ స్థానిక క్రికెటర్ మహ్మద్ షరీఫ్ సలహా మేరకు లెగ్ స్పిన్కు మారడం అతని కెరీర్ను మార్చేసింది. ఆ తర్వాత పుతూర్ త్రిస్సూర్కు షిఫ్ట్ అయ్యాడు. సెయింట్ థామస్ కాలేజ్ తరపున కేరళ కాలేజ్ ప్రీమియర్ టీ20 లీగ్లో స్టార్గా నిలవడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సంవత్సరం మొదట్లో ముంబై ఇండియన్స్ అతన్ని సౌత్ ఆఫ్రికాలో జరిగిన SA20 లీగ్లో MI కేప్ టౌన్ టీమ్ కోసం నెట్ బౌలర్గా పంపింది. అక్కడ అతనికి మంచి ఎక్స్పోజర్ లభించింది.
పుతూర్ సూపర్ పెర్ఫార్మెన్స్ చేసినా ముంబై ఇండియన్స్ మాత్రం గెలవలేకపోయింది. రచిన్ రవీంద్ర అజేయంగా 65 పరుగులు, గైక్వాడ్ మెరుపు ఇన్నింగ్స్ (53) తో సీఎస్కే ముంబై పెట్టిన 155/9 టార్గెట్ను ఈజీగా చేజ్ చేసింది. ఈ నాలుగు వికెట్ల విజయంతో సీఎస్కే ఐపీఎల్ 2025 సీజన్ను గ్రాండ్గా స్టార్ట్ చేసింది. కానీ ముంబై మాత్రం 2012 నుంచి ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్లో ఓడిపోయే చెత్త రికార్డును ఈసారి కూడా కంటిన్యూ చేసింది.