IPL 2026: ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Thota Jaya Madhuri
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటే సొంతంగా ఉత్సవం. ప్రతి సీజన్‌కి క్రీడాప్రియులు, అభిమానులు వేలకొద్దీ అంచనాలు, ఉత్సాహంతో ఎదురుచూస్తారు. 2026 IPL దగ్గర పడుతున్న వేళ, ఈ సీజన్‌పై రెండు కీలక వార్తలు బయటకు వచ్చాయి. ఒకటి ఫ్యాన్స్‌కి సంతోషం ఇస్తుందంటే, మరొకటి జేబుకు గట్టి షాక్ ఇవ్వబోతుంది. చేదు వార్త – GST 28% నుంచి 40%కి పెరుగుతోంది! IPL టికెట్లపై కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం ఈ సీజన్‌ను కొంత కష్టం చేసేలా ఉంది. వస్తు సేవల పన్ను (GST) 28% నుండి 40%కి పెరిగింది. దీని ప్రభావం టికెట్ ధరలపై నేరుగా పడుతుంది. ఉదాహరణకి:


రూ .500 టికెట్ ఇప్పుడు ₹700 అవుతుంది (మునుపటి ధర ₹640)

రూ. 1,000 టికెట్ ఇప్పుడు ₹1,400 అవుతుంది (మునుపటి ₹1,280)

రూ. 2,000 టికెట్ ఇప్పుడు ₹2,800 అవుతుంది (మునుపటి ₹2,560)

చాలా మ్యాచ్‌లను చూడడానికి వెళ్ళే అభిమానులకు ఇది పెద్దగా ఆర్థిక ప్రభావం చూపుతుంది. ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుందని భావించబడుతోంది. అయితే, సాధారణ క్రికెట్ ప్రేమికులు ఈ కొత్త ధరలతో అన్ని మ్యాచ్‌లకు వెళ్ళగలరా అనే ఆందోళనలు ఉన్నాయి.



తీపి వార్త – MS ధోని మరో సీజన్ ఆడే అవకాశం .. మంచి వార్త ఏమిటంటే, “కెప్టెన్ కూల్” మహేంద్ర సింగ్ ధోని IPL 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడే అవకాశం ఉంది. భారత క్రికెట్‌లో అత్యంత అభిమానించే ఆటగాళ్లలో ఒకరైన ధోని, తన ప్రత్యేకమైన ఆట శైలి, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండటం, అద్భుతమైన ఫీల్డింగ్, బ్యాటింగ్, లీడర్‌షిప్‌ను మరోసారి ప్రదర్శిస్తారు. ధోని తిరిగి వస్తే, అభిమానులు మరోసారి ‘Captain Cool’ కింద CSK ఆటను ఆనందంగా చూడగలరని భావిస్తున్నారు.



ఇక IPL 2026 పర్ఫార్మెన్స్, టీమ్స్‌లోని ప్లేయర్స్ పోటీ, ఫ్రాంచైజీలు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాయో, ఈ GST పెరుగుదల & ధోని తిరిగి రాకపోగా ఫ్యాన్స్‌కి ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి. టికెట్ ధరలు పెరిగినా, ధోని ఫ్యాన్స్ ఆస్త‌కితో పట్టు కట్టడం ఖాయమే. ఈ 2026 IPL సీజన్, క్రికెట్ ప్రేమికులకి రెండు ముఖాలా – ఒకటి ఆర్థిక భారంతో, మరొకటి ఆట ఉత్సాహంతో – మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: